Share News

CM Jagan: నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్..

ABN , Publish Date - Apr 02 , 2024 | 08:13 AM

అమరావతి: ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. ఈ క్రమంలోనే.. మేమంతా సిద్ధం అంటూ వైసీసీ అధినేత, సీఎం జగన్ బస్సు యాత్రతో దూకుడు పెంచారు. మరోసారి అధికారమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తూ ఎన్నికల క్షేత్రంలో దూసుకుపోతున్నారు.

CM Jagan: నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్..

అమరావతి: ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో అన్ని ప్రధాన పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. ఈ క్రమంలోనే.. మేమంతా సిద్ధం (Siddam) అంటూ వైసీసీ అధినేత, సీఎం జగన్ (CM Jagan) బస్సు యాత్ర (Bus Yatra)తో దూకుడు పెంచారు. మరోసారి అధికారమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తూ ఎన్నికల క్షేత్రంలో దూసుకుపోతున్నారు. కాగా జగన్మోహన్ రెడ్డి మంగళవారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా ఇవాళ సాయంత్రం మదనపల్లెలో 4:30 గంటల నుంచి 5.30 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం సోమల మండలం, అమ్మగారి పల్లి వద్ద రాత్రికి బస చేయనున్నారు. కాగా సత్యసాయి జిల్లా తనకల్లు మండలం బస ప్రాంతం నుంచి మంగళవారం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల బస్సు యాత్ర మొదలుకానుంది. మొలకలచెరువు, పెద్దపాలెం, గొల్లపల్లి అంగళ్లు మీదుగా మధ్యాహ్నం 12 గంటలకు విశ్వం కాలేజీ ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడ నుంచి సాయంత్రం నాలుగు గంటలకు బయలుదేరి మదనపల్లెకు చేరుకుని టిప్పు సుల్తాన్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తారు.

Updated Date - Apr 02 , 2024 | 08:16 AM