Home » Madanapalle
అన్నమయ్య జిల్లా స్థూల ఉత్పత్తిలో రెండేళ్లుగా నిలకడగా ఉంది. అదే సమయంలో తలసరి ఆదాయం గత ఏడాదితో పోల్చితే దిగజారింది.
జిల్లాలోని మదనపల్లె, ములకలచెరువు, గుర్రంకొండ, అంగళ్లు టమోటా మార్కెట్లలో మార్చి 2వ తేదీ నుంచి 15 కిలోల క్రేట్లతోనే టమోట వేలం నిర్వహించనున్నట్లు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్ రామాంజనేయులు పేర్కొన్నారు.
అన్నమయ్య జిల్లాలో జలధార పథకంతో సాధించిన ప్రగతిని కేంద్రం దృష్టికి కలెక్టర్ నిశాంత్కుమార్ తీసుకెళ్లారు. జలవనరుల శాఖ, ఉపాధిహామీ పథకాలతో చేపట్టిన పనుల వివరాలతో నివేదికను పంపించారు.
సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వచ్చే ప్రయాణికులపై అదనపు చార్జీల భారం మోపితే చర్యలు తప్పవని ఆర్టీవో అశోక్ప్రతాప్ హెచ్చరించారు.
బోయకొండ పుణ్యక్షేత్రంలో నిధుల దుర్వినియోగం, అవకతవకలపై విచారణ చేపట్టినట్లు కాణిపాకం ఆలయ ఈవో పెంచల కిషోర్ పేర్కొన్నారు.
లబ్ధిదారులకు ఇకపై మెటీరియల్కు బదులుగా నగదు రూపంలో బిల్లులు చెల్లించాలని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఆదేశాలతో లబ్ధిదారులకు, గృహనిర్మాణ శాఖ అఽఽధికారులకు కూడా ఊరట కలిగింది.
పంటలపై ఏనుగుల దాడులు ఆగడం లేదు. పులిచెర్ల మండలంలోని పాళెం పంచాయతీలో ఒంటరి ఏనుగు మామిడి, కొబ్బరి చెట్లను విరిచేసింది. సోమల మండలంలో జంట ఏనుగులతోపాటు ఒంటరి ఏనుగు కలిసి వరినార్లు, మామిడి, అరటి తోటలను నాశనం చేశాయి.
భారతదేశ చిత్రపటంలో అనేక ప్రత్యేకతలున్న పట్టణం మదనపల్లె. 114 ఏళ్ల కల ఫలించి ఇప్పుడు జిల్లా కేంద్రంగా మారింది. వాగ్గేయకారుడు అన్నమయ్య పేరుతో ఏర్పడిన జిల్లాకు కొత్త కేంద్రంగా గురువారం నుంచి పాలన మొదలైంది.
కిడ్నీ రాకెట్ కేసులో.. గ్లోబల్ ఆసుపత్రిని పోలీసులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రితోని ఆపరేషన్ థియేటర్, ఆపరేషన్కు ఉపయోగించిన పరికరాలు, మందులను స్వాధీనం చేసుకున్నారు. కిడ్నీ రాకెట్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పెద్దలు కూడా దీనిపై సీరియస్ అయినట్లు సమాచారం.
ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ పట్టుబట్టి ముందుండి అమలు చేయించిన స్థానిక ఎమ్మెల్యే ఎం. షాజహానా బాషాకు మదనపల్లి కౌన్సిలర్లు కృతజ్ఞతలు తెలిపారు.