Share News

Nara Family: దేవాన్ష్ పుట్టిన రోజు.. శ్రీవారి ఆశీస్సులు పొందిన నారా కుటుంబం

ABN , Publish Date - Mar 21 , 2024 | 09:20 AM

Andhrapradesh: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని నారా కుటుంబం దర్శించుకుంది. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు మనవడు, యువనేత లోకేష్ కుమారుడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా గురువారం ఉదయం నారా కుటుంబం తిరుమలకు చేరుకుని శ్రీవారి సేవలో పాల్గొన్నారు. లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్, భువనేశ్వరి శ్రీనివాసుడిని దర్శించుకున్నారు.

Nara Family: దేవాన్ష్ పుట్టిన రోజు.. శ్రీవారి ఆశీస్సులు పొందిన నారా కుటుంబం

తిరుమల, మార్చి 21: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీవారిని నారా కుటుంబం (Nara Family) దర్శించుకుంది. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu) మనవడు, యువనేత లోకేష్ (Nara lokesh) కుమారుడు దేవాన్ష్ (Nara Devansh) పుట్టిన రోజు సందర్భంగా గురువారం ఉదయం నారా కుటుంబం తిరుమలకు చేరుకుని శ్రీవారి సేవలో పాల్గొన్నారు. లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్, భువనేశ్వరి శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. దేవాన్ష్ పుట్టినరోజు కావడంతో లోకేష్, కుటుంబ సభ్యులు... శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

AP Politics: ఎన్నికల ముందు పవన్ మరో కీలక నిర్ణయం!

‘‘నిజం గెలవాలి’’ యాత్రలో ఉన్న భువనేశ్వరి గత రాత్రే తిరుమలకు చేరుకున్నారు. అలాగే లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్ నిన్న సాయంత్రమే తిరుమలకు వచ్చారు. అనంతరం ఈరోజు ఉదయం నారా కుటుంబ సభ్యులు తిరుమలేశుడిని దర్శించుకున్నారు. ప్రతీఏటా దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని నారా కుటుంబం దర్శించుకుని, అన్నదానం చేస్తూ వస్తున్నారు. అలాగే ఈసారి కూడా నారావారి కుటుంబ సభ్యులు శ్రీవారిని దర్శించుకుని, ఆశీస్సులు పొందారు. ఆపై అన్నప్రసాద సముదాయంలో భక్తులకు అల్పాహారాన్ని వడ్డించారు.

ఇవి కూడా చదవండి..

Tirumala: భారీగా పెరిగిన భక్తుల రద్దీ.. నేడు ఎన్ని కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారో తెలిస్తే..

TG Politics: కాంగ్రెస్ మలి జాబితాపై ఉత్కంఠ!


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 21 , 2024 | 10:25 AM