Share News

AP Politics: చంద్రగిరిలో వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలో చేరిన కీలక నేతలు..

ABN , Publish Date - Apr 06 , 2024 | 09:44 AM

AP Elections 2024: చంద్రగిరి నియోజకవర్గంలో(Chandragiri) అధికార వైసీపీకి(YCP) బిగ్ షాక్ తగిలింది. ఏళ్ల తరబడి ఆ పార్టీలో కీలకంగా ఉన్న నేతలు.. టీడీపీలో(TDP) చేరారు. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని(Nani) ఆధ్వర్యంలో.. చంద్రబాబు(Chandrababu) సమక్షంలో వైసీపీ నేతలు టీడీపీ కండువా కప్పుకున్నారు.

AP Politics: చంద్రగిరిలో వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలో చేరిన కీలక నేతలు..
YSRCP vs TDP

AP Elections 2024: చంద్రగిరి నియోజకవర్గంలో(Chandragiri) అధికార వైసీపీకి(YCP) బిగ్ షాక్ తగిలింది. ఏళ్ల తరబడి ఆ పార్టీలో కీలకంగా ఉన్న నేతలు.. టీడీపీలో(TDP) చేరారు. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని(Nani) ఆధ్వర్యంలో.. చంద్రబాబు(Chandrababu) సమక్షంలో వైసీపీ నేతలు టీడీపీ కండువా కప్పుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వైసీపీకి చెందిన నేతలు ప్రముఖ పారిశ్రామికవేత్త రమణమూర్తి, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ ముడిపల్లి సురేష్ రెడ్డి, పాకాల జడ్పీటీసీ సభ్యురాలు నంగా పద్మజారెడ్డి, వైసీపీ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నంగా బాబు రెడ్డి, ఇతర నేతలు చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.


పార్టీని వీడి టీడీపీలో చేరిన నేతలు.. వైసీపీ అధినేత జగన్ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ నాయకత్వంలో తమకు గుర్తింపు లేదన్నారు. ఎమ్మెల్యే పీఏ, పీఆర్వోల పెత్తనం ఎక్కువైందని ఆరోపించారు. కనీసం ప్రోటోకాల్ పాటిచంకుండా తీవ్ర అవమానాలుకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీలో ప్రజాప్రతినిధులంతా ఉత్సవ విగ్రహాలుగా మారాల్సి వచ్చిందని విమర్శించారు. గడిచిన ఐదేళ్ల కాలంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టలేకపోయామని అన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 06 , 2024 | 09:44 AM