Share News

Chandrababu: జగన్ సర్కార్‌పై ఓ రేంజ్‌లో విరుచుకుపడిన చంద్రబాబు!

ABN , Publish Date - Apr 15 , 2024 | 04:36 PM

జగన్ ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. సోమవారం నాడు రాజాంలో ‘ప్రజాగళం’ భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Chandrababu: జగన్ సర్కార్‌పై ఓ రేంజ్‌లో విరుచుకుపడిన చంద్రబాబు!

విజయనగరం: జగన్ ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. రాజాంలో జరుగుతున్న ‘ప్రజాగళం’ భారీ బహిరంగ సభావేదికగా.. సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


AP Police: జగన్‌పై రాయి విసిరిందెవరో చెప్పేయండి.. బహుమతి కొట్టేయండి..

ఈ సభకు కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని వదిలి పెట్టమని వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఉచిత ఇసుక ఇచ్చి ఆదుకుంటానని హామీ ఇచ్చారు. కుంభకోణాలు చేసే వారిని ఉక్కుపాదంతో అణచి వేస్తానని చంద్రబాబు హెచ్చరించారు.


ఉత్తరాంధ్రలో 35 సీట్లు గెలుస్తామని బాబు ధీమా వ్యక్తం చేశారు. జగన్‌కు వచ్చేది కూలీ జనం... తమ సభలకు ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారని చెప్పారు. జగన్... జే.గన్ రెడ్డి... జగన్ అబద్దాలు అద్భుతంగా చెబుతాడు. జగన్ అబద్ధాలు చెప్పడంలో పీహెచ్‌డీ చేశారని సెటైర్లు గుప్పించారు.

ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని గాలికి వదిలేశారని మండిపడ్డారు. జగన్ అంతా రివర్స్ పాలనే అని విమర్శించారు. జగన్ పాలనలో రాష్ట్రం భ్రష్టు పట్టిపోయిందని ధ్వజమెత్తారు. జగన్ ఒక మానసిక రోగి అని చంద్రబాబు దెప్పిపొడిచారు. చంద్రబాబు పవర్‌ఫుల్ ప్రసంగాన్ని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి లైవ్‌లో చూసేయండి..

ఇవి కూడా చదవండి

AP Elections: సీఎం జగన్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు..!

Sunitha Reddy: తండ్రి హత్యోదంతాన్ని వివరిస్తూ భావోద్వేగానికి గురైన సునీతా రెడ్డి

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 15 , 2024 | 05:07 PM