Share News

Bhuvaneswari: అనంత, కర్నూలులో ‘నిజం గెలవాలి’ యాత్ర.. షెడ్యూల్ ఇదే

ABN , Publish Date - Mar 06 , 2024 | 09:52 AM

Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి ‘‘నిజం గెలవాలి’’ యాత్రలో భాగంగా ఉమ్మడి అనంతపురం, కర్నూల్ జిల్లాల పర్యటించనున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు అనంతపురం, కర్నూలు జిల్లాలో భువనేశ్వరి పర్యటన సాగనుంది. అనంతపురం, కళ్యాణదుర్గం, రాయదుర్గం, గుంతకల్లు, పత్తికొండ, ఆలూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో భువనమ్మ పర్యటించనున్నారు.

Bhuvaneswari: అనంత, కర్నూలులో ‘నిజం గెలవాలి’ యాత్ర..  షెడ్యూల్ ఇదే

అమరావతి, మార్చి 6: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) సతీమణి భువనేశ్వరి (Bhuvaneswari) ‘‘నిజం గెలవాలి’’ (Nijam Gelavali) యాత్రలో భాగంగా ఉమ్మడి అనంతపురం, కర్నూల్ జిల్లాల పర్యటించనున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు అనంతపురం, కర్నూలు జిల్లాలో భువనేశ్వరి పర్యటన సాగనుంది. అనంతపురం, కళ్యాణదుర్గం, రాయదుర్గం, గుంతకల్లు, పత్తికొండ, ఆలూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో భువనమ్మ పర్యటించనున్నారు. ఈరోజు అనంతపురం జిల్లా, అనంతపురం, కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల్లో పర్యటన సాగనుంది. చంద్రబాబు అరెస్టు సమయంలో మనస్తాపానికి గురై మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తున్నారు. ఈరోజు మొత్తం 5 కుటుంబాలను పరామర్శించనున్నారు. మరికాసేపట్లో బెంగళూరు విమానాశ్రయానికి భువనేశ్వరి చేరుకోనున్నారు.

ఇవి కూడా చదవండి..

Gold Price: ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?

YCP: దళిత మహిళపై వైసీపీ నేత దాడి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 06 , 2024 | 09:59 AM