KTR: రైతుబంధు రాకుండా మోదీ, రేవంత్ ఆపారు
ABN , First Publish Date - 2023-11-27T15:51:31+05:30 IST
Telangana Elections: రైతుబంధు రాకుండా ప్రధాని మోదీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ ఆపారని మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. హుజురాబాద్లో మంత్రి మాట్లాడుతూ... ప్రధాన మంత్రి మోడీకి రేవంత్ చెప్తే.. మోడీ ఎన్నికల కమిషన్కు ఫోన్ చేశారన్నారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి రైతులకు రైతుబంధు రాకుండా చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరెంట్ కోసం కష్టపడ్డ రోజులు గుర్తుకు తెచ్చుకోవాలన్నారు.
![KTR: రైతుబంధు రాకుండా మోదీ, రేవంత్ ఆపారు](https://media.andhrajyothy.com/media/2023/20231102/ktr_1_fc99db5cf6.jpg)
కరీంనగర్: రైతుబంధు రాకుండా ప్రధాని మోదీ (PM Modi), టీపీసీసీ చీఫ్ రేవంత్ (TPCC Chief Revanth Reddy) ఆపారని మంత్రి కేటీఆర్ (Minister KTR) విమర్శలు గుప్పించారు. హుజురాబాద్లో మంత్రి మాట్లాడుతూ... ప్రధాన మంత్రి మోడీకి రేవంత్ చెప్తే.. మోడీ ఎన్నికల కమిషన్కు ఫోన్ చేశారన్నారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి రైతులకు రైతుబంధు రాకుండా చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరెంట్ కోసం కష్టపడ్డ రోజులు గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. పాత చీకటి రోజులు మళ్ళీ రావాలా అని ప్రశ్నించారు. తెలంగాణలో పేద రైతులకు మూడు ఎకరాల కంటే ఎక్కువ భూమి లేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి