Home » Rythu Bandhu
Telangana: తెలంగాణలో రైతు భరోసా పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. రైతు బంధు పంపిణీపై ఈసీ ఆంక్షలు విధించింది. ఎన్నికల పోలింగ్ తర్వాతే నిధులు విడుదల చేయాలంటూ ఎన్నికల సంఘం ఆదేశించింది. రైతు భరోసా పథకంపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఈసీ పేర్కొంది.
తెలంగాణలో రైతులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. సోమవారం రైతుభరోసా(రైతుబంధు) నిధులు విడుదల చేసింది. ఐదు ఎకరాలకు పైబడి ఆరెకరాల్లోపు ఉన్న రైతుల ఖాతాల్లో నిధులను జమ చేసింది. 39 లక్షల ఎకరాలకు గానూ రూ. 2000 కోట్ల నిధుల బకాయిలు ఉన్నట్లు గతంలో వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు.
Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బుధవారం నాడు ‘రైతు నేస్తం’(Rythu Nestham) కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka), వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageswara Rao) పాల్గొన్నారు. రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించే వినూత్న కార్యక్రమమే ‘రైతు నేస్తం’.
రైతుబంధు సాయానికి బ్రేక్ పడినట్టేనని అంతా భావిస్తున్నారు. ఈనెల 12వ తేదీ వరకే రైతులకు పెట్టుబడి సాయం అందింది. ఆ తరువాత రోజు నుంచి రైతుబంధు సొమ్ము రైతుల బ్యాంకు ఖాతాలో జమకావడం లేదు.
Telangana: మేడిగడ్డపై సంబంధిత మంత్రి స్పందిస్తారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... ప్రజా భవన్లో ఎవరైనా రోజు ఉదయం 8:30 నుంచి 9:30 వరకు కలవొచ్చని అన్నారు. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ఏమీ చేయలేదని విమర్శించారు.
Telangana Elections: ఎన్నికల లబ్ది కోసం రైతుబంధుని వారి అకౌంట్లో వేసే కార్యక్రమం చేపట్టాలని కుట్రలతో బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుందని పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఖమ్మం రూరల్ మండలం కామంచికల్ ఎన్నికల ప్రచారంలో పొంగులేటి మాట్లాడుతూ.. అక్టోబర్ 26నాడే కేంద్ర ఎన్నికల కమిషన్కు కాంగ్రెస్ పార్టీ విన్నపం ఇచ్చిందని చెప్పారు.
Telangana Elections: రైతుబంధు రాకుండా ప్రధాని మోదీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ ఆపారని మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. హుజురాబాద్లో మంత్రి మాట్లాడుతూ... ప్రధాన మంత్రి మోడీకి రేవంత్ చెప్తే.. మోడీ ఎన్నికల కమిషన్కు ఫోన్ చేశారన్నారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి రైతులకు రైతుబంధు రాకుండా చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరెంట్ కోసం కష్టపడ్డ రోజులు గుర్తుకు తెచ్చుకోవాలన్నారు.
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రైతులకు తీపి కబురు చెప్పింది. రైతాంగం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రైతుబంధు ( Raitu Bandhu ) పెట్టుబడి సాయం అందించేందుకు మార్గం సుగమమైంది.
Telangana Assembly Elections : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు (TS Assembly Polls) మరికొన్నిరోజులే సమయం ఉంది. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే.. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నారు...