Train Video: బాబోయ్.. ఇంత రిస్క్ చేశావేంటమ్మా..? తేడా వస్తే ప్రాణాలే పోతాయని తెలిసినా..!

ABN , First Publish Date - 2023-08-18T20:46:00+05:30 IST

బతుకు పోరాటంలో కొందరు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి మరీ సాహసాలు చేస్తుంటారు. పది మందిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాల కొందరు, పొట్టకూటి కోసం మరికొందరు.. ప్రాణాలు పోతాయని తెలిసినా తెగించి నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఇలాంటి వ్యక్తులను చూసినప్పుడు కొన్నిసార్లు కోపం వస్తే..

Train Video: బాబోయ్.. ఇంత రిస్క్ చేశావేంటమ్మా..? తేడా వస్తే ప్రాణాలే పోతాయని తెలిసినా..!

బతుకు పోరాటంలో కొందరు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి మరీ సాహసాలు చేస్తుంటారు. పది మందిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాల కొందరు, పొట్టకూటి కోసం మరికొందరు.. ప్రాణాలు పోతాయని తెలిసినా తెగించి నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఇలాంటి వ్యక్తులను చూసినప్పుడు కొన్నిసార్లు కోపం వస్తే.. మరికొన్నిసార్లు అయ్యో పాపం! అని అనిపిస్తుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ యువతికి సంబంధించిన వీడియో ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. రైలు ప్రయాణంలో ఈమె చేసిన సాహసం చూసి.. బాబోయ్.. ఇంత రిస్క్ చేశావేంటమ్మా..? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (Viral video) అవుతోంది. ముంబై లోకల్ రైల్లో (Mumbai Local Train) ప్రయాణికుల రద్దీ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ప్రాణాలకు తెగించి మరీ అక్కడి వారు చేసే ప్రమాదకర ప్రయాణానికి (Dangerous journey) సంబంధించిన వీడియోలు రోజూ చూస్తూనే ఉంటాం. కనీసం కాలు పెట్టడానికి కూడా స్థలం లేకున్నా.. విధిలేని పరిస్థితుల్లో చాలా మంది ప్రాణాలకు తెగించి ప్రయాణం చేస్తుంటారు. తాజాగా, ఓ యువతికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. అప్పటికే లోకల్ ట్రైన్ ప్రయాణికులతో పూర్తిగా నిండిపోయింది. అయితే త్వరగా గమ్యస్థానం చేరాలనే ఉద్దేశంతో ఓ యువతి (young woman) బోగీ ద్వారం వద్ద వేలాడుతూ ప్రయాణం చేసింది. కాలు పెట్టుకోవడానికి స్థలం లేకున్నా.. ఉన్న కొద్ది పాటి స్థలంలో ఒక పాదం మాత్రమే పెట్టి, చేతులతో గట్టిగా పట్టుకుని అలాగే వేలాడుతూ వెళ్లింది.

Metro Train: అచ్చం అమ్మాయిలాగానే.. మెట్రో రైల్లో ఓ కుర్రాడి డాన్స్.. పక్కనే కూర్చున్న ప్రయాణీకుల రియాక్షన్ ఇదీ..!

బోగీ డోరు వద్ద వేలాడుతూ ఉన్న ఆమెను చూసిన వారంతా షాక్ అయ్యారు. కొద్ది దూరం వెళ్లాక మరికొంత స్థలం దొరకడంతో రెండు పాదాలు మోపేందుకు వీలు దొరికింది. అయినా ఆమె ప్రయాణించిన తీరు చూసి తోటి ప్రయాణికులంతా అయ్యో పాపం! అంటూ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పొట్టకూటి కోసం ఇలాంటి సాహసాలు తప్పదు’’.. అంటూ కొందరు, ‘‘మరిన్ని రైళ్లు వేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి’’.. అంటూ మరికొందరు, ‘‘డబ్బు సంపాదన కంటే ముందు ప్రాణాలు ముఖ్యం.. ఇలాంటి సాహసాలు ఎవరూ చేయొద్దు’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 9లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Wife: ఫోన్ వచ్చినప్పుడల్లా దూరంగా వెళ్లి మాట్లాడుతున్న భార్య.. అనుమానం వచ్చి చాటుగా విన్న భర్తకు మైండ్‌బ్లాక్.. చివరకు..!

Updated Date - 2023-08-18T20:46:00+05:30 IST