Love Story: కాలేజీలో పనిచేయడానికి వచ్చిన ఓ కుర్రాడితో ప్రేమలో పడిన ఇంటర్ అమ్మాయి.. ఇంట్లో ఒప్పుకోలేదని ఏం చేసిందంటే..!

ABN , First Publish Date - 2023-09-09T20:12:10+05:30 IST

ప్రేమ ఎప్పుడు, ఎలా, ఎవరిపై పుడుతుందో ఎవరూ చెప్పలేరు. అందం గురించి కానీ, ఆస్తిపాస్తుల గురించి గానీ పట్టించుకోని ప్రేమికులు.. తమ ప్రేమను పెళ్లి వరకూ తీసుకెళ్లేందుకు ఎంతకైనా తెగిస్తారు. ఈ క్రమంలో చివరకు తల్లిదండ్రులను సైతం ఎదిరించడం చూస్తూనే ఉన్నాం. తాజాగా...

Love Story: కాలేజీలో పనిచేయడానికి వచ్చిన ఓ కుర్రాడితో ప్రేమలో పడిన ఇంటర్ అమ్మాయి.. ఇంట్లో ఒప్పుకోలేదని ఏం చేసిందంటే..!
ప్రతీకాత్మక చిత్రం

ప్రేమ ఎప్పుడు, ఎలా, ఎవరిపై పుడుతుందో ఎవరూ చెప్పలేరు. అందం గురించి కానీ, ఆస్తిపాస్తుల గురించి గానీ పట్టించుకోని ప్రేమికులు.. తమ ప్రేమను పెళ్లి వరకూ తీసుకెళ్లేందుకు ఎంతకైనా తెగిస్తారు. ఈ క్రమంలో చివరకు తల్లిదండ్రులను సైతం ఎదిరించడం చూస్తూనే ఉన్నాం. తాజాగా, రాజస్థాన్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. కాలేజీలో కూలి పని చేయడానికి వచ్చిన కుర్రాడితో ఇంటర్ అమ్మాయి ప్రేమలో పడింది. అయితే వీరి ప్రేమను ఇంట్లో అంగీకరించలేదు. దీంతో ఇద్దరూ కలిసి చివరికి ఏం చేశారంటే..

రాజస్థాన్ (Rajasthan) చురు జిల్లా సుజన్‌గఢ్ తహసీల్ ప్రాంత పరిధి సరోథియా గ్రామానికి చెందిన సీత అనే యువతి (young woman) 12వ తరగతి చదువుతున్న సమయంలో అనుకోని విధంగా ఓ వ్యక్తి ఈమె జీవితంలోకి వచ్చాడు. గజ్‌సర్ గ్రామానికి చెందిన రోహిత్ అనే యువకుడు.. అదే కళాశాలలో కూలి పని చేసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో రోహిత్‌ను చూడగానే సీతకు నచ్చేసింది. తర్వాత ఇద్దరూ ఒకరి నంబర్లు మరొకరు మార్చుకున్నారు. అనంతరం రోజూ ఫోన్లలో మాట్లాడుకునేవారు. ఇలా వీరి మధ్య అనుకోకుండా ప్రేమ (love) మొదలైంది.

KBC Winner: 22 ఏళ్ల క్రితం కేబీసీ షోలో కోటి రూపాయలు గెలిచిన ఈ పిల్లాడు.. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలిస్తే..!

women.jpg

చివరకు వారి ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపారు. దీంతో సీత తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము చెప్పిన సంబంధమే చేసుకోవాలని షరతు విధించారు. అయితే సీత మాత్రం ఎలాగైనా రోహిత్‌నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. చివరకు ఆగస్టు 24న రోహిత్‌తో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇద్దరూ ఢిల్లీ (Delhi) వెళ్లి ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న సీత కుటుంబ సభ్యులు.. చంపేస్తామంటూ బెదిరించారు. దీంతో భయపడిపోయిన సీత, రోహిత్.. తమకు రక్షణ కల్పించాలంటూ ఎస్పీ కార్యాలయానికి చేరుకుని విన్నవించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వార్త (Viral news) సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: అపార్ట్‌మెంట్‌లో వేకువజాము సమయంలోనే చోరీ.. ఇళ్లల్లోకి చొరబడకుండా దొంగలు చేసిన పనిని.. సీసీ కెమెరాల్లో చూసి చివరకు అంతా షాక్..

Updated Date - 2023-09-09T20:12:10+05:30 IST