లక్షన్నర సుఫారీ ఇచ్చి మరీ ఈ యువతిని చంపించాడో వ్యక్తి.. ఎందుకీ పని చేశావని అతడిని పోలీసులు నిలదీస్తే..

ABN , First Publish Date - 2023-03-30T21:21:03+05:30 IST

మహిళలకు ఇంటా, బయటా ఏదో ఒక రూపంలో నిత్యం సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. వివాహమైన మహిళలకు భర్త, అత్తమామలతో సమస్యలు తలెత్తితే.. బాలికలు, యువతులకు తోటి విద్యార్థులు, టీచర్లు, స్నేహితుల రూపంలో ఇబ్బందులు తలెత్తుంటాయి. ఎక్కువగా..

లక్షన్నర సుఫారీ ఇచ్చి మరీ ఈ యువతిని చంపించాడో వ్యక్తి.. ఎందుకీ పని చేశావని అతడిని పోలీసులు నిలదీస్తే..

మహిళలకు ఇంటా, బయటా ఏదో ఒక రూపంలో నిత్యం సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. వివాహమైన మహిళలకు భర్త, అత్తమామలతో సమస్యలు తలెత్తితే.. బాలికలు, యువతులకు తోటి విద్యార్థులు, టీచర్లు, స్నేహితుల రూపంలో ఇబ్బందులు తలెత్తుంటాయి. ఎక్కువగా ప్రేమ వ్యవహారాల్లో యువతులపై దాడులు చేసుకోవడం రోజూ చూస్తూనే ఉన్నాం. తాజాగా, జార్ఖండ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి లక్షన్నర సుఫారీ ఇచ్చి మరీ.. యువతిని చంపించాడు. ఎందుకీ పని చేశావని పోలీసులు నిలదీయగా.. అతడు చెప్పిన సమాధానం ఏంటంటే..

జార్ఖండ్ (Jharkhand) కోడెర్మా జిల్లా దోమ్‌చాంచ్ ప్రాంత పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన సోనీకుమారి అలియాస్ సోనాలి కుమారి అనే యువతి (young woman) .. ఇదే ప్రాంతానికి చెందిన దీపక్ సావ్ అనే వ్యక్తి వద్దకు ట్యూషన్‌కి వెళ్లేది. ఆమెకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన దీపక్.. అందుకు విరుద్ధంగా ప్రవర్తించాడు. కొన్నాళ్లు బాగానే చదువు చెప్పిన అతను.. రాను రాను ఆమెపై ప్రేమ (Love) పెంచుకున్నాడు. ఎలాగైనా తన దారికి తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేసేవాడు. ఈ క్రమంలో ఇటీవల ఓ రోజు ఎవరూ లేని సమయంలో ఆమె వద్దకి వెళ్లి.. ‘‘నువ్వంటే నాకు చాలా ఇష్టం.. నీకు ఇష్టమైతే పెళ్లి చేసుకుంటా’’.. అని చెప్పాడు. ఈ మాటతో యువతి ఒక్కసారిగా షాక్ అయింది.

Married Couple: పాపం ఈ కుర్రాడు.. పెళ్లయిన నెల రోజులకే ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించి ఉండడు..!

పదే పదే అదే మాట అంటుండడంతో.. ‘‘మీలో కేవలం గురువును మాత్రమే చూస్తున్నా.. అలాంటి ఆలోచనలు పెట్టుకోకండి’’.. అని చెప్పింది. దీంతో దీపక్ తీవ్ర అవమానంగా భావించాడు. అయినా ఆమెను మర్చిపోకుండా ప్రేమించమంటూ వేధించేవాడు. ఇంకోసారి ఇలా మాట్లాడితే బాగుండదు.. అని యువతి గట్టిగా మందలించడంతో దీపక్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. తనకు దక్కనిది.. ఎవరికీ దక్కకూడదనే ఉద్దేశంతో చివరకు ఆమెను అంతం చేయాలని కుట్ర పన్నాడు. ఇందుకోసం కొందరికి రూ.1.5లక్షల సుఫారీ ఇచ్చాడు.

14 ఏళ్ల బాలికకు పదే పదే కడుపునొప్పి.. మాత్రలు వాడినా ఫలితం లేక ఆస్పత్రికి.. స్కానింగ్‌‌ చేశాక డాక్టర్లు చెప్పింది విన్న తల్లిదండ్రులకు..

మార్చి 21 ట్యాషన్‌కి వచ్చిన ఆమెను.. లోన్ ఇప్పిస్తానంటూ తనతో పాటూ వేరే ప్రాంతానికి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న కొందరితో కలిసి యువతిని గొంతు నులిమి (Assault on young woman) హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని సంచిలో చుట్టి, సమీపంలోని నదిలో పడేశారు. మార్చి 27న నీటిలో తేలుతున్న మృతదేహాన్ని చూసిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. చివరకు దీపక్ సావ్‌తో పాటూ మరికొంతమందిని అరెస్ట్ చేశారు. ప్రేమించకపోవడంతోనే హత్య చేశానని దీపక్ ఒప్పుకోవడంతో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోద చేశారు. దీపక్ సావ్‌ గతంలో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు గుర్తించారు. కాగా, యువతి హత్య ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది.

Wife: ఏం చేయమంటారు..? నా భర్త వికలాంగుడు.. నేను ఇలాంటి పనులు చేస్తేనే ఇల్లు గడుస్తుందంటూ.. పోలీసులకు తేల్చిచెప్పిన ఈ మహిళ కథేంటంటే..

Updated Date - 2023-03-30T21:24:38+05:30 IST