Home » Jharkhand
ఝార్ఖండ్లో గురువారం విద్యార్థుల నిరసన కార్యక్రమానికి సంబంధించి పోలీసులు 600 మందిపై కేసు నమోదు చేశారు.
జార్ఖండ్లో జరిగిన SSC పరీక్షలో అవకతవకలు జరిగినట్లు తేలిందని.. ఈ క్రమంలోనే విద్యార్థులు ఆందోళన చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. వారిపైనా రబ్బర్ బుల్లెట్స్, లాఠీఛార్జి చేశారన్నారు.
రాంచీలో సోమవారం ప్రశాంతంగా ప్రారంభమైన విద్యార్థుల ర్యాలీకి అడ్డంకులు సృష్టించిన వారి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ ఛైర్మన్ ఎల్.ఖియాంగ్టేను ఆ రాష్ట్ర సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. రాష్ట్రంలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చి విద్యార్థులు భారీగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఎల్.ఖియాంగ్టేను అదుపులోకి తీసుకున్నారు.
జార్ఖండ్లోని రాంచీలో విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉధృతమైంది. ఉద్యోగ నియామక పరీక్షల్లో అవకతవకలు, పేపర్ లీక్లపై చర్యలు తీసుకోవాలంటూ జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ అభ్యర్థులు, విద్యార్థులు సోమవారం అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. ఈ సందర్భంగా వారిపై పోలీసులు వాటర్ కేనన్లు ప్రయోగించి లాఠీఛార్జ్ చేశారు.
ఝార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పేపర్ లీక్ ఉదంతంపై విద్యార్థుల నిరసనలు కీలక దశకు చేరుకున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో విద్యార్థులు అసెంబ్లీ వరకూ ర్యాలీని ప్రారంభించారు.
ఝార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జేపీఎస్సీ) ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలపై సీఐడీ, ఈడీ విచారణలకు ప్రభుత్వం అంగీకరించినా.. విద్యార్థులు ఆందోళన విరమించటం లేదు.
ఉద్యోగ నియామకాల పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ అభ్యర్థులు చేపట్టిన ఆందోళనలతో ఝార్ఖండ్ ప్రభుత్వం దిగొచ్చింది. ముగ్గురు పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామాలను గవర్నర్ ఆమోదించారు. ఈ వ్యవహారంలో నేరపూరిత కోణాన్ని 'సీఐడీ','ఈడీ' విచారణకు కూడా కేంద్రానికి విజ్ఞప్తి చేయనుంది.
ఝార్ఖండ్లో పేపర్ లీక్ ఉదంతంపై ప్రస్తుతం విద్యార్థులు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితమే అక్కడ వెలుగు చూసిన పేపర్ లీక్ ఉదంతం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీక్ ఘటనలకు నిరసనగా విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు జార్ఖండ్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే ఓసారి వారితో చర్చలు జరపగా.. తాజాగా శనివారం రెండో దఫా చర్చలు నిర్వహించింది.