ఎవరీ సంతోష్ మిశ్రా..? నెట్టింట వైరల్‌గా మారిన ఐపీఎస్ ఆఫీసర్ పెళ్లి ఫొటోలు.. అమెరికాలో రూ.50 లక్షల జీతాన్నిచ్చే జాబ్‌కు గుడ్‌బై చెప్పి..

ABN , First Publish Date - 2023-03-04T15:51:01+05:30 IST

అమెరికాలో మంచి ఉద్యోగం.. రూ.50లక్షల ప్యాకేజీ.. చదువు అనంతరం ఇంతకంటే ఎవరికైనా కావాల్సింది ఏముంటుందీ. కానీ కొందరు అంతటితో సంతృప్తి చెందరు. దేశానికి తన వంతుగా ఏదో చేయాలని తపిస్తుంటారు. ఇందుకోసం..

ఎవరీ సంతోష్ మిశ్రా..? నెట్టింట వైరల్‌గా మారిన ఐపీఎస్ ఆఫీసర్ పెళ్లి ఫొటోలు.. అమెరికాలో రూ.50 లక్షల జీతాన్నిచ్చే జాబ్‌కు గుడ్‌బై చెప్పి..

అమెరికాలో మంచి ఉద్యోగం.. రూ.50లక్షల ప్యాకేజీ.. చదువు అనంతరం ఇంతకంటే ఎవరికైనా కావాల్సింది ఏముంటుందీ. కానీ కొందరు అంతటితో సంతృప్తి చెందరు. దేశానికి తన వంతుగా ఏదో చేయాలని తపిస్తుంటారు. ఇందుకోసం మంచి మంచి ఉద్యోగాలకు స్వస్తి చెప్పి.. స్వదేశానికి వచ్చి తమ లక్ష్యాలను నెరవేర్చుకుంటుంటారు. ఇలాంటి వారి గురించి గతంలో ఎన్నోసార్లు చెప్పుకొన్నాం.. ఇప్పుడు చెప్పుకోబోయే ఐపీఎస్ సంతోష్ మిశ్రా కూడా ఇదే కోవలోకి వస్తాడు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు నెట్టంట వైరల్‌గా మారాయి. ఇంతకీ ఈ సంతోష్ మిశ్రా ఎవరు.. ? ఈయన నేపథ్యానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

బీహార్ (Bihar) పాట్నాకు చెందిన సంతోష్ మిశ్రా.. స్థానికంగా పదో తరగతి, ఇంటర్ పూర్తి చేశాడు. అనంతరం పూణే యూనివర్సిటీ (University of Pune) నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో పట్టా పొందారు. అనంతరం క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో యూరోపియన్ కంపెనీకి ఎంపికయ్యాడు. తర్వాత నాలుగేళ్ల పాటు ఐరోపాలో (Europe) పని చేశాడు. మళ్లీ అక్కడి నుంచి రూ.50లక్షల ప్యాకేజీతో అమెరికాలో (America) ఉద్యోగంలో చేరాడు. సుమారు ఏడేళ్ల పాటు అక్కడే పని చేశారు. సంతోష్ తండ్రి ఆర్మీలో పని చేసి రిటైర్డ్ అయ్యారు. దీంతో మొదటి నుంచీ సంతోష్ మిశ్రాకు.. స్వదేశం కోసం తన వంతుగా సేవ చేయాలని ఉండేది. చివరకు 2011లో అమెరికా ఉద్యోగానికి స్వస్తి చెప్పి స్వదేశానికి వచ్చాడు. సుమారు ఏడాది పాటు UPSC పరీక్షకు (UPSC Exam) ప్రిపేర్ అయ్యాడు.

నన్ను చంపేశారు.. రూ.25 కోట్లు పరిహారం ఇప్పించండంటూ హైకోర్టులో వింత కేసు.. నువ్వు దెయ్యానివి అనడానికి ఆధారాలు లేవంటూ..!

success-story-of-santosh-mi.jpg

తర్వాత తొలి ప్రయత్నంలోనే 144వ ర్యాంకు సాధించి అమ్రోహాలో ఎస్పీగా విధుల్లో చేరారు. అనంతర కాలంలో గోండా అనే ప్రాంతంలో కూడా పని చేశారు. ప్రస్తుతం ఈయన యూపీలోని మీర్జాపూర్ ఎస్పీగా (Mirzapur SP Santosh Mishra) పని చేస్తున్నారు. సంతోష్ మిశ్రా మొదటి నుంచీ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ వస్తున్నాడు. దీంతో ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్‌బుక్ (Instagram, Twitter, Facebook) వంటి వాటిలో వేలల్లో ఫాలోవర్లు ఉన్నారు. ఇటీవలే ఈయన వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం సంతోష్ మిశ్రా వివాహానికి సంబంధించిన ఫొటోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. చదువు పూర్తయిన వెంటనే విదేశాల్లో ఉద్యోగాలు చేయాలని చాలా మంది యువత కోరుకుంటూ ఉంటారు. అలాంటి ప్రస్తుత తరుణంలో విదేశాల్లో లక్షల జీతాన్ని వదులుకుని, దేశ సేవకు అంకితమైన సంతోష్ మిశ్రాను అంతా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Viral Video: విమానం టేకాఫ్ అయేటప్పుడు వాటిని ఎందుకు ఓపెన్ చేయాలి..? ఈ పైలెట్ చెప్పిన మూడు కారణాలు వింటే..!

Updated Date - 2023-03-04T15:59:12+05:30 IST