India vs Australia World Cup final: అదిరేటి డ్రస్సేసిన అనుష్క.. ధర చూసి అవాక్కవుతున్న ఫ్యాన్స్..
ABN , First Publish Date - 2023-11-19T20:08:36+05:30 IST
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్పైనే అందరి దృష్టీ పడింది. ఈ రెండు జట్లలో ఏ టీమ్ గెలుస్తుందోనని అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఈ మ్యాచ్ చూడటానికి...
![India vs Australia World Cup final: అదిరేటి డ్రస్సేసిన అనుష్క.. ధర చూసి అవాక్కవుతున్న ఫ్యాన్స్..](https://media.andhrajyothy.com/media/2023/20231102/Anushka_sharma_bc0a769711.jpg)
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్పైనే అందరి దృష్టీ పడింది. ఈ రెండు జట్లలో ఏ టీమ్ గెలుస్తుందోనని అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఈ మ్యాచ్ చూడటానికి ప్రధాని నరేంద్ర మోదీతో (Prime Minister Narendra Modi) పాటూ పలువురు సెలబ్రిటీలు హాజరైన విషయం తెలిసిందే. అయితే ఇదే మ్యాచ్కు విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ.. కూతురు వామికతో కలిసి వచ్చింది. ఈ సందర్భంగా అనుష్క.. బ్రీజీ బ్లూ, వైట్ ప్రింటెడ్ డ్రెస్లో స్టైలిష్గా కనిపించింది. దీంతో క్రికెట్ అభిమానులంతా అనుష్క ధరించిన దుస్తుల ధరపై ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ (India vs Australia World Cup final) మ్యాచ్కు హాజరైన అనుష్క శర్మ.. మ్యాచ్ ఆద్యాంతం ఉత్సాహంగా కనిపించింది. ఆమె ధరించిన తెల్లటి దుస్తులపై నీలం రంగులో ఉన్న సీతాకోకచిలుకలు, చెట్ల బొమ్మలు ఎంతో ఆకర్షణీయంగా కనిపించాయి. దీంతో అభిమానులంతా ఆమె వేసుకున్న డ్రెస్ (Anushka sharma dress) ధరపై వివిధ రకాలుగా చర్చించుకుంటున్నారు. ఇంతకీ అనుష్క శర్మ వేసుకున్న డ్రెస్ ధర ఎంతుంటుందీ.. అని ఆరాతీయగా రూ.7,250లు అని తెలిసింది.
ఈ మేరకు ఓ ఆన్లైన్ ప్లాట్ఫామ్.. డ్రెస్తో పాటూ ధరనూ ప్రకటించింది. పాకెట్స్తో కూడిన ఈ డ్రెస్.. ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. అనష్క స్వతహాగా నటి కావడంతో ష్యాషన్ విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటుంది. దీంతో అనుష్క మ్యాచ్కి హాజరైన ప్రతీసారీ ప్రత్యేక ఆకర్షణగా నిలస్తుంటుంది. ఈసారి ఆమె బ్లూ, వైట్ ప్రింటెడ్ డ్రెస్తో తక్కువ మేకప్లో ఎంతో స్టైలిష్గా కనిపించింది. ప్రస్తుతం అనుష్కకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇదిలావుండగా, వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్కి ప్రధాని మోదీతో పాటూ సినీ హీరోలు షారూఖ్ ఖాన్, దీపికా పదుకొణె, రణవీర్ సింగ్, వెంకటేష్ తదితరులు హాజరయ్యారు.