Share News

KBC Show: పిల్లాడు కాదు.. చిచ్చర పిడుగు.. రూ.7 కోట్లను గెలిచే ఛాన్స్ తృటిలో మిస్సయింది కానీ..!

ABN , First Publish Date - 2023-11-22T17:41:47+05:30 IST

చిన్న వయసులో కొందరు పిల్లలు ఆటల్లో మునిగిపోతుంటే.. మరికొందరు ఆటలతో పాటూ చదువుపై కూడా శ్రద్ధ వహిస్తుంటారు. అయితే ఇంకొందరు పిల్లలు మాత్రం ఆటలు, చదువుతో పాటూ పెద్దలకూ సాధ్యం కాని పనులను కూడా చేసి.. అందరితో...

KBC Show: పిల్లాడు కాదు.. చిచ్చర పిడుగు.. రూ.7 కోట్లను గెలిచే ఛాన్స్ తృటిలో మిస్సయింది కానీ..!

చిన్న వయసులో కొందరు పిల్లలు ఆటల్లో మునిగిపోతుంటే.. మరికొందరు ఆటలతో పాటూ చదువుపై కూడా శ్రద్ధ వహిస్తుంటారు. అయితే ఇంకొందరు పిల్లలు మాత్రం ఆటలు, చదువుతో పాటూ పెద్దలకూ సాధ్యం కాని పనులను కూడా చేసి.. అందరితో శభాష్ అనిపించుకంటుంటారు. ఇలాంటి పిల్లలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైర్ అవుతుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే బాలుడు కూడా ఈ కోవకే చెందుతాడు. చదివేది ఆరో తరగతే కానీ.. ఏకంగా కేబీసీ షోలో అద్భుత ప్రతిభ కనబరచాడు. రూ.7కోట్లు గెలిచే ఛాన్స్ తృటిలో మిస్సయింది కానీ.. ఇతడు మొత్తానికి ఎంత మొత్తం గెలుచుకున్నాడంటే..

బీహార్ (Bihar) దర్భంగా జిల్లా బహదర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధి ప్రాంతానికి చెందిన అక్షయ్ ఆనంద్ అనే బాలుడు.. ఢిల్లీ (Delhi) మోడ్‌లోని దర్భంగా పబ్లిక్ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్నాడు. బాలుడి తండ్రి ఘనశ్యామ్ ఝా అసిస్టెంట్ ప్రఫెసర్‌గా (Assistant Professor) పని చేస్తుంటాడు. తల్లి ఆర్తీ ఝా బ్యాంకు ఉద్యోగిగా పనిచేస్తూ.. కొడుకు సంరక్షణ బాధ్యతలు చూసుకుంటూ ఉండేది. అయితే ఇటీవలే ఆమె కేన్సర్ కారణంగా మృతి చెందింది. ఇదిలావుండగా.. బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) హోస్ట్‌గా వ్యవహిరిస్తున్న ‘‘కౌన్ బనేగా కరోడ్‌పతి జూనియర్ (KBC) ’’.. ప్రోగ్రాంకి అక్షయ్ ఆనంద్ నవంబర్‌లో సెలెక్ట్ అయ్యాడు. సెలక్ట్ అవడమే కాకుండా అమితాబ్ అడిగిన మొదటి 10 ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చాడు. అలాగే 11వ ప్రశ్నకు అక్షయ్ 3 లైఫ్ లైన్లను ఉపయోగించాడు. అయినా సరైన సమాధానం ఇచ్చి రూ.6.40లక్షలు గెలుచుకున్నాడు.

Technology: ఇదేం టెక్నాలజీ బాబోయ్.. వాయిస్‌తో ఓ మహిళను ఏమార్చి.. క్షణాల్లోనే రూ.1.40 లక్షలు మటాష్..!

అలాగే ర్యాపిడ్ ఫైర్ ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇచ్చి రూ.90వేలు.. ఇలా మొత్తం రూ.7.30లక్షలు గెలుచుకున్నాడు. అయితే రూ.7కోట్ల ప్రైజ్ మనీ గెలుచుకునే క్రమంలో 12వ ప్రశ్న వద్ద అక్షయ్ కాస్త గందరగోళపడ్డాడు. అయితే ఆ సమయంలో రిస్క్ తీసుకోకుండా గెలిచిన ప్రైజ్ మనీతో గేమ్ నుంచి నిష్క్రమించాడు. ఇదిలావుండగా, గేమ ఆడుతున్న సమయంలోనే అక్షయ్ ఆనంద్ తల్లి కేన్సర్ కారణంగా చికిత్స తీసుకుంటూ మృతి చెందింది. ఈ వార్త తెలిసినా అక్షయ్ కుంగిపోకుండా మనోధైర్యంతో గేమ్ ఆడాడు. కేబీసీ షోలో తాను సమర్థవంతంగా ఆడటానికి తన తల్లి మార్గదర్శకమే కారణమని తెలిపాడు. అక్షయ్ తల్లి కూడా 2019లో కేబీసీ హాట్ సీట్‌ వరకూ వెళ్లారు. కాగా, ప్రస్తుతం అక్షయ్ ఆనంద్‌ కేబీసీ షోలో ప్రైజ్ మనీ గెలవడంపై నెటిజన్లు అభినందనలు తెలియజేస్తున్నారు.

Viral: ఇద్దరు పోలీసులకు వింత శిక్ష.. గడ్డి కోయండంటూ హైకోర్టు ఆదేశాలు.. ఇంతకీ అసలేం జరిగిందంటే..!

Updated Date - 2023-11-22T18:18:05+05:30 IST