Home » Andhra Pradesh » Vizianagaram
జిల్లా రాజకీయాలను మహిళలు శాసించబోతున్నారు. పార్టీల గెలుపు రాతను నారీమణులే రాయబోతున్నారు. అభ్యర్థుల విజయావకాశాలను వారే నిర్ణయించబోతున్నారు. వారి కరుణపొందిన వారే అధికారం చేపట్టబోతున్నారు. జిల్లాలో పురుషుల కంటే మహిళల ఓట్లు ఎక్కువ. ఈ నేపథ్యంలో వారి ఓట్లే అభ్యర్థుల బలాబలాలను నిర్ణయించబోతున్నాయి.
ఎన్నికల వేళ నేతలకు సరికొత్త చిక్కు వచ్చిపడింది. నిన్న మొన్నటి వరకు ప్రత్యర్థి పార్టీలో ఉన్న నేతలు ఇప్పుడు సొంతవారయ్యారు. ఇలా జోరుగా గోడ దూకుడుల పర్వం కొనసాగుతోంది. ఇంతవరకు బాగానే ఉన్నా నేతలకు ఇప్పుడు కోవర్ట్ల భయం పట్టుకుంది.
రాష్ట్రంలో దోపీడీ తప్ప.. అభివృద్ధి లేదని ప్రజలు ఆలోచించి రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ఓటేయాలని టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు కోరారు. పుచ్చలవీధి జంక్షన్, పూల్బాగ్లోని కోర్టు జంక్షన్లో ఆయన ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఎన్నికల్లో మద్యం వినియోగం తగ్గించాలన్న ఆలోచనతో ఇండెంట్ పెట్టే అవకాశం షాపులకు లేకుండా ఈసీ నియంత్రించింది. ఉన్నతాధికారులే ఏఏ బ్రాండ్ల మద్యం.. ఎంతెంత అవసరమో గుర్తించాలని చెప్పింది. ఈ ఆదేశం జిల్లాలోని ఓ ఎక్సైజ్ అధికారికి కాసులు తెచ్చిపెడుతోంది.
గంట్యాడ మండలం కొటారుబిల్లి కూడలిలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో ఇటీవల అక్రమాలు బయట పడ్డాయి. మద్యం బాటిళ్ల మూతలపై వేసిన సీళ్లు తొలగించి నిల్వలను పక్కదారి పట్టిస్తున్న వైనాన్ని ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో ముగ్గురు సేల్స్మన్లను తొలగించారు.
ఉద్యోగుల సమస్యలను సీఎం జగన్ గాలికివదిలేశారు. సకాలంలో వేతనాలు అందక.. సమగ్రమైన పీఆర్సీకి నోచుకోక... మెడికల్, ఇతర బిల్లులూ దక్కక వారు తీవ్ర నిరాశతో నెట్టుకొచ్చారు. ఉద్యోగ సంఘం నేతలు తమ సమస్యలపై సీఎం కలిసి విన్నవించుకుందామన్నా దర్శనం దొరికేది కాదు. 2019 ఎన్నికలకు ముందు ఉద్యోగులపై ప్రేమ కురిపించిన ఆయన అధికారంలోకి వచ్చాక దగ్గరకు రానివ్వలేదు. ఈ ఐదేళ్లూ ఉద్యోగవర్గాలు ఉద్యమాలతోనే నెట్టుకువచ్చాయి. కలెక్టరేట్ నిత్యం నిరసనలతో అట్టుడుకేది. విజయనగరం ఆందోళనకారులతో నిండిపోయేది.
అబద్ధాలు చెప్పడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని కూటమి సాలూరు ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మిడి సంధ్యారాణి ఎద్దేవా చేశారు.
రాష్ట్రాన్ని అన్ని విధాలా వెనక్కి నెట్టివేసిన వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు ఓటు హక్కు ద్వారా తగిన బుద్ధి చెప్పి ఇంటికి పంపిం చాలని కూటమి అభ్యర్థి బోనెల విజయ చంద్ర కోరారు.
పేదల ఆర్థికాభివృద్ధికి సూపర్సిక్స్ పథకాలు ఎంతో ఉపయో గపడతాయని కూటమి అభ్యర్థి నిమ్మక జయకృష్ణ అన్నారు.
కూటమి ప్రభుత్వం అధికా రంలోకి వస్తే గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పి స్తామని కురుపాం ఎమ్మెల్యే అభ్యర్థి తోయిక జగదీశ్వరి అన్నారు.