అబద్ధాలలో ఆస్కార్కు జగన్ అర్హుడు
ABN , Publish Date - Apr 29 , 2024 | 12:14 AM
అబద్ధాలు చెప్పడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని కూటమి సాలూరు ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మిడి సంధ్యారాణి ఎద్దేవా చేశారు.
మెంటాడ: అబద్ధాలు చెప్పడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని కూటమి సాలూరు ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మిడి సంధ్యారాణి ఎద్దేవా చేశారు. మెంటాడ మండలంలోని బడేవలస, చల్లపేట గ్రామాల్లో ఆమె ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఆమెకు ఘన స్వాగతం పలికారు. పలువురు మహిళలు హారతులు పట్టారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీ మేనిఫెస్టో ఆ పార్టీ ఓటమిని ముందే సూచిస్తోందని ఆమె ఎద్దేవా చేశారు. మూడు పార్టీల సమన్వయం, ప్రజల ఆశీస్సులతో తప్పక గెలుస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇంటింటికీ వెళ్లి సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ, కర పత్రాలను పంపిణీ చేశారు. సైకిల్ గుర్తుపై ఓటువేసి, తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు పాల్గొన్నారు.