Share News

వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలి

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:12 AM

రాష్ట్రాన్ని అన్ని విధాలా వెనక్కి నెట్టివేసిన వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు ఓటు హక్కు ద్వారా తగిన బుద్ధి చెప్పి ఇంటికి పంపిం చాలని కూటమి అభ్యర్థి బోనెల విజయ చంద్ర కోరారు.

వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలి

పార్వతీపురం రూరల్‌: రాష్ట్రాన్ని అన్ని విధాలా వెనక్కి నెట్టివేసిన వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు ఓటు హక్కు ద్వారా తగిన బుద్ధి చెప్పి ఇంటికి పంపిం చాలని కూటమి అభ్యర్థి బోనెల విజయ చంద్ర కోరారు. మండలంలోని వీరభద్రా పురం, జమ్మిడివలస, అంటివలస తదితర గ్రామాల్లో ఆయన ఆదివారం ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ఆర్టీసీ చార్జీలు, విద్యుత్‌ చార్జీలు, నిత్యావసర సరుకుల ధరలు ఇష్టారాజ్యంగా పెంచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు బోనుదేవి చంద్రమౌళి, కూటమి నాయకులు గొట్టాపు వెంకటనాయుడు, గురజాన చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

సీతానగరం: రాష్ట్రంలో అరాచక పాలన సాగించే వైసీపీని తరిమి కొట్టాలని కూటమి పార్వతీపురం ఎమ్మెల్యే అభ్యర్థి బోనెల విజయచంద్ర పిలుపునిచ్చారు. మండలంలోని కొత్తవలస, చెల్లంనాయుడువలస గ్రామా ల్లో టీడీపీ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సత్యంనాయుడు, వేణుగోపాలనాయుడు ఆధ్వర్యంలో ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో యాండ్రపు వాసుదేవరావు, చింతల రామకృ ష్ణ, రెడ్డి ధనుంజయరావు, చెల్లంనాయు డువలస సర్పంచ్‌ వాకాడ అప్పమ్మ, పారినాయుడు, దాసరి వాసుదేవరావు, సింహాచలం పాల్గొన్నారు.

Updated Date - Apr 29 , 2024 | 12:12 AM