Home » Andhra Pradesh » East Godavari
జనసేన గుర్తు గాజుగ్లాసును పోలిన పెన్స్టాండు గుర్తును మరో పార్టీ అభ్యర్థికి కేటాయించేందుకు ఎన్నికల అధికారులు చేసిన ప్రయత్నం వివాదాస్పదంగా మారింది. నామినేషన్ పత్రాల్లో పేర్కొన్న గుర్తులు కాకుండా మరో గుర్తు కేటాయించాలంటూ సదరు అభ్యర్థి చేసిన దరఖాస్తును పరిగణలోకి తీసుకునేందుకు అధికారులు ప్రయత్నించడం నిబంధనలకు విరుద్ధమని, ఇది పలు అనుమానాలకు తావిస్తున్నదని జనసేన నేతలు ఆరోపించారు.
ఆ ఎనిమిది మందీ ప్రాణ స్నేహితులు. వారిలో నలుగురు మైనర్లే. ఒకరికి మాత్రమే వివాహమైంది. ఒకరిది తెల్లవారితే పుట్టినరోజు. ముందుగానే వేడుకలు జరుపుకోవాలని వారంతా ఒకే ఆటోలో యానాం వెళ్లారు. అక్కడే మద్యం సేవించి అర్ధరాత్రి దాటిన తర్వాత తిరిగి వస్తుండగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ భట్నవిల్లి శ్రీవనువులమ్మ ఆలయ సమీపంలో ఎదురుగా వస్తున్న చేపల లోడు లారీని ఢీకొట్టారు.
‘డిగ్రీలు పుచ్చుకొని.. పొట్ట చేతపట్టుకుని’ ఈ మాటలు ఎక్కడో విన్నట్టు ఉన్నాయి కదూ.. ఆకలిరాజ్యం సినిమాలోని సూపర్హిట్ పాటలో ఒక లైన్ ఇది.. ఈ ఐదేళ్లు జగన్ ప్రభు త్వం ఈ మాటను నిజం చేసింది.. యువతకు ఉద్యోగాల్లేవ్.. చిన్నా చితక ఉద్యోగాలు తప్ప చదువుకు తగిన ఉద్యోగాల ఊసేలేదు..
మైనింగ్ను అక్రమంగా దోచేందుకే ప్రత్తిపాడు నియోజకవర్గంపై వైసీపీ నాయకులు కన్నువేశారని జనసేన అధినేత పవన్కళ్యాణ్ అన్నా రు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వ రంలో ఆదివారం నిర్వహించిన జనసేన బహిరంగ సభలో పవన్ మాట్లాడారు.
మైనింగ్ను అక్రమంగా దోచేందుకే ప్రత్తిపాడు నియోజకవర్గంపై వైసీపీ నాయకులు కన్నువేశారని జనసేన అధినేత పవన్కళ్యాణ్ అన్నా రు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వ రంలో ఆదివారం నిర్వహించిన జనసేన బహిరంగ సభలో పవన్ మాట్లాడారు. ప్రత్తిపాడు మండలంలో లేటరైట్ పేరుతో బాక్సైట్నూ తరలించుకుపోతున్నారన్నారు.
వైసీపీ పాలకులు రాజమహేంద్రవరాన్ని గత ఐదేళ్లుగా అస్తవ్యస్తం చేశారు. కూట మి అధికారంలోకి వచ్చాక నగరవైభవాన్ని ఇనుమడింపచేస్తూ మోడల్ సీటీగా అభి వృద్ధి చేస్తానని టీడీపీ-జనసేన- బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నా రు.
జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో హోమ్ ఓటింగ్కోసం ప్రత్యేకంగా 69 బృందాలు ఏర్పాటుచేశామని జిల్లా ఎన్నికల అధికారిణి డాక్టర్ కె.మాధవీలత తెలిపారు.
అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నరసింహస్వామివారి విగ్రహానికి అలంకరణ నిమిత్తం నెల్లూరుకు చెందిన ఎవర్మార్క్ న్యూట్రాసిటికల్స్ ఎల్ఎల్పీ సంస్థ అధినేతలు అప్పల రంగనాథం, అప్పలరాజ్కుమార్, కవిత, అప్పల దిలీప్ చక్రవర్తి కల్పన రూ.9.70 లక్షల విలువైన 155 గ్రాముల బంగారు కిరీటాన్ని ఆదివారం బహూకరించారు.
రాజమహేంద్రవరం రీజినల్ పరిధిలో ఆదివారం జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్హత పరీక్ష (ఏపీసెట్)కు 5452 మంది అభ్యర్థులు హాజరయ్యారని, పరీక్ష ప్రశాంత వాతావరణంలో జరిగిందని ఏపీ సెట్ రాజమహేంద్రవరం రీజినల్ కోఆర్డినేటర్ ఆచార్య వై.శ్రీనివాసరావు తెలిపారు.
అన్నవరం సత్యదేవుడి దివ్య కల్యాణోత్సవ ఏర్పాట్లపై ఆదివారం మధ్యాహ్నం పెద్దాపురం ఆర్డీవో సీతారామారావు అధ్యక్షతన ఈవో రామచంద్రమోహన్ వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది స్వామివారి దివ్య కల్యాణోత్సవాలు మే 18న ప్రారంభమై 24 వరకు జరగనుండగా 19 రాత్రి వార్షిక కల్యాణ వేదికపై అంగరంగవైభవంగా సత్యదేవుడి కల్యాణం జరగనుంది.