Share News

లక్ష్మీ నరసింహునికి బంగారు కిరీటం బహూకరణ

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:20 AM

అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నరసింహస్వామివారి విగ్రహానికి అలంకరణ నిమిత్తం నెల్లూరుకు చెందిన ఎవర్‌మార్క్‌ న్యూట్రాసిటికల్స్‌ ఎల్‌ఎల్‌పీ సంస్థ అధినేతలు అప్పల రంగనాథం, అప్పలరాజ్‌కుమార్‌, కవిత, అప్పల దిలీప్‌ చక్రవర్తి కల్పన రూ.9.70 లక్షల విలువైన 155 గ్రాముల బంగారు కిరీటాన్ని ఆదివారం బహూకరించారు.

లక్ష్మీ నరసింహునికి బంగారు కిరీటం బహూకరణ

అంతర్వేది, ఏప్రిల్‌ 28: అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నరసింహస్వామివారి విగ్రహానికి అలంకరణ నిమిత్తం నెల్లూరుకు చెందిన ఎవర్‌మార్క్‌ న్యూట్రాసిటికల్స్‌ ఎల్‌ఎల్‌పీ సంస్థ అధినేతలు అప్పల రంగనాథం, అప్పలరాజ్‌కుమార్‌, కవిత, అప్పల దిలీప్‌ చక్రవర్తి కల్పన రూ.9.70 లక్షల విలువైన 155 గ్రాముల బంగారు కిరీటాన్ని ఆదివారం బహూకరించారు. తొలుత అర్చక స్వాములు బంగారు కిరీటానికి సంప్రోక్షణ, ప్రత్యేక పూజలు నిర్వహించి నరసింహస్వామివారి ఉత్సవ విగ్రహానికి అలంకరించారు. అనంతరం బంగారు కిరీటాన్ని బహూకరించిన దాతలకు అర్చకులు, వేద పండితులచే మహదాశీర్వచనం జరిపించారు. స్వామివారి చిత్రపటం, ప్రసాదాన్ని అందించారు. కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్‌ వి.సత్యనారాయణ, బోనం సారథి, బోనం రాజు, ఎవర్‌మార్క్‌ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Apr 29 , 2024 | 12:20 AM