Home » Andhra Pradesh » Chittoor
మే నెలకు సంబంధించి పింఛను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేసేలా డీఆర్డీఏ అధికారులు ఏర్పాట్లు చేశారు. వృద్ధాప్య, వితంతు, చేనేత, దివ్వాంగులు, అభయహస్తం, కల్లుగీత, ఒంటరి మహిళ, మత్స్యకారులు, డప్పు కళాకారులు, సైనిక్ వెల్ఫేర్ ఇలా 16 రకాల పింఛన్లకు జిల్లాలో 2,72,864 మంది లబ్ధిదారులు ఉన్నారు.
సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా చిత్తూరు నగరంలో గంగజాతర మే 13, 14 తేదీల బదులు 21, 22 తేదీల్లో జరుగుతుందని కలెక్టర్ షన్మోహన్ తెలిపారు.
ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న 16,547 మందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు కలెక్టర్ షన్మోహన్ తెలిపారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియకు తెరపడింది. చిత్తూరు పార్లమెంటు స్థానానికి ఇద్దరు, ఏడు అసెంబ్లీ స్థానాలకు ఐదుగురు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.
ఎర్రచందనం స్మగ్లర్, మద్యం అక్రమ రవాణా, ఇసుక మాఫియా, భూకబ్జా చేసేవాడికి వైసీపీ చిత్తూరు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందని, అతనిపై అనేక పోలీస్స్టేషన్లలో కేసులున్నాయని విజయానందరెడ్డిని ఉద్దేశించి టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు.
సదుం మండలంలో బీసీవై పార్టీ అఽధ్యక్షుడు బి.రామచంద్రయాదవ్పై సోమవారం హత్యాయత్నం జరిగింది. ఎర్రాతివారిపల్లె గ్రామం, సదుం పోలీస్ స్టేషన్లలో వైసీపీ అల్లరి మూకలు ఆయనపై దాడికి పాల్పడ్డాయి. పార్టీ ప్రచారరథానికి నిప్పుపెట్టాయి. వాహనాలను ధ్వసం చేశాయి.
జిల్లాలో పోస్టల్ బ్యాలెట్కు 22,416 దరఖాస్తులందాయి.జిల్లావ్యాప్తంగా 15,936మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో వుండగా హోం ఓటింగ్కు అర్హులైన వారు కూడా ఫారం 12, 12డి దరఖాస్తులను జిల్లా అధికారులకు అందజేశారు.
తిరుమలలో కూటమి నాయకుల ప్రచారాన్ని మధ్యలో పోలీసులు అడ్డుకున్నారు. కూటమి తిరుపతి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులుతో కలిసి జనసేన నేత కిరణ్రాయల్, టీడీపీ నేతలు పనబాక లక్ష్మి, సుగుణమ్మ, నరసింహ యాదవ్, జేబీ శ్రీనివాస్, ఊకా విజయ్కుమార్, కోడూరు బాలసుబ్రహ్మణ్యం తిరుమలలో సోమవారం ఉదయం ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు.
చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పులివర్తి నానీకి తక్షణం వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ కల్పించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
బాలాయపల్లి మండలంలోని నిడిగల్లు అడవుల్లో ఓ కంటైనర్ను స్థానికులు గుర్తించారు. సమాచారం అందించడంతో తహసీల్దార్ పుల్లారావు, ఎస్ఐ మహబూబ్ సుభాని సిబ్బందితో అడవిలోకి వెళ్లి కంటైనర్ తాళాలను తొలగించి పరిశీలించారు.