Share News

నానీకి సెక్యూరిటీ కల్పించండీ

ABN , Publish Date - Apr 30 , 2024 | 01:46 AM

చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పులివర్తి నానీకి తక్షణం వన్‌ ప్లస్‌ వన్‌ సెక్యూరిటీ కల్పించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.

నానీకి సెక్యూరిటీ కల్పించండీ

పోలీసులకు హైకోర్టు ఆదేశం

అమరావతి, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పులివర్తి నానీకి తక్షణం వన్‌ ప్లస్‌ వన్‌ సెక్యూరిటీ కల్పించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి సోమవారం ఆదేశాలిచ్చారు. తమకు సెక్యూరిటీ కల్పించేలా తిరుపతి జిల్లా ఎస్పీ, పోలీసులను ఆదేశించాలని కోరుతూ పులివర్తి నానీ, ఆయన సతీమణి, కుమారుడు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు రాగా పిటిషనర్‌ తరఫున న్యాయవాది పీవీజీ ఉమేశ్‌చంద్ర వాదనలు వినిపించారు.

Updated Date - Apr 30 , 2024 | 01:46 AM