Share News

పెన్షన్‌ సొమ్ము లబ్ధిదారుల ఖాతాల్లోకి..

ABN , Publish Date - Apr 30 , 2024 | 02:07 AM

మే నెలకు సంబంధించి పింఛను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేసేలా డీఆర్‌డీఏ అధికారులు ఏర్పాట్లు చేశారు. వృద్ధాప్య, వితంతు, చేనేత, దివ్వాంగులు, అభయహస్తం, కల్లుగీత, ఒంటరి మహిళ, మత్స్యకారులు, డప్పు కళాకారులు, సైనిక్‌ వెల్ఫేర్‌ ఇలా 16 రకాల పింఛన్లకు జిల్లాలో 2,72,864 మంది లబ్ధిదారులు ఉన్నారు.

పెన్షన్‌ సొమ్ము లబ్ధిదారుల ఖాతాల్లోకి..

చిత్తూరు (సెంట్రల్‌), ఏప్రిల్‌ 29 : మే నెలకు సంబంధించి పింఛను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేసేలా డీఆర్‌డీఏ అధికారులు ఏర్పాట్లు చేశారు. వృద్ధాప్య, వితంతు, చేనేత, దివ్వాంగులు, అభయహస్తం, కల్లుగీత, ఒంటరి మహిళ, మత్స్యకారులు, డప్పు కళాకారులు, సైనిక్‌ వెల్ఫేర్‌ ఇలా 16 రకాల పింఛన్లకు జిల్లాలో 2,72,864 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి సంబంధించి రూ.79.87 కోట్ల నిధులు జిల్లాకు చేరాయి. ఈ మొత్తాలను డైరెక్ట్‌ బెనిఫిషరీ ట్రాన్స్‌ఫర్‌ (డీబీటీ) పద్ధతిలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయనున్నారు. ఆధార్‌ నంబరు లింక్‌తో బ్యాంకు ఖాతాలున్న 1,92,021 మంది పింఛనుదారులకు డీబీటీ ద్వారా, లింకు లేని 80,843 మందికి నేరుగా అందజేయనున్నారు. రెండో తేదీ నుంచి పింఛన్‌దారులు నగదు తీసుకునేందుకు అధిక సంఖ్య ఏటీఎంలు అందుబాటులో ఉంచుతామని అధికారులు తెలిపారు.

Updated Date - Apr 30 , 2024 | 02:07 AM