నిడిగల్లు అడవుల్లో కంటైనర్
ABN , Publish Date - Apr 30 , 2024 | 01:43 AM
బాలాయపల్లి మండలంలోని నిడిగల్లు అడవుల్లో ఓ కంటైనర్ను స్థానికులు గుర్తించారు. సమాచారం అందించడంతో తహసీల్దార్ పుల్లారావు, ఎస్ఐ మహబూబ్ సుభాని సిబ్బందితో అడవిలోకి వెళ్లి కంటైనర్ తాళాలను తొలగించి పరిశీలించారు.
బాలాయపల్లి, ఏప్రిల్ 29:బాలాయపల్లి మండలంలోని నిడిగల్లు అడవుల్లో ఓ కంటైనర్ను స్థానికులు గుర్తించారు. సమాచారం అందించడంతో తహసీల్దార్ పుల్లారావు, ఎస్ఐ మహబూబ్ సుభాని సిబ్బందితో అడవిలోకి వెళ్లి కంటైనర్ తాళాలను తొలగించి పరిశీలించారు. కంటైనర్ ఖాళీగా ఉండడాన్ని గమనించారు. అయితే అడవిలో కంటైనర్ను ఎందుకు వదిలేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.కంటైనర్లో మద్యం తీసుకొచ్చి ఇక్కడినుంచి తరలించి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు.