Share News

BJP: తెలంగాణకు బీజేపీ అగ్రనేతలు.. త్వరలో ప్రధాని మోదీ, అమిత్ షా పర్యటన

ABN , Publish Date - Apr 20 , 2024 | 03:57 PM

లోక్‌సభ ఎన్నికల్లో రెండంకెల సీట్లు సాధించడమే ధ్యేయంగా బీజేపీ(BJP) అగ్రనాయకత్వం తెలంగాణలో పర్యటించనుంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని స్పీడప్ చేసిన బీజేపీ.. నామినేషన్లు ముగిసిన వెంటనే మరింత వేగం పెంచనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఏప్రిల్ 27న హైదరాబాద్‌కు రానున్నారు.

BJP: తెలంగాణకు బీజేపీ అగ్రనేతలు.. త్వరలో ప్రధాని మోదీ, అమిత్ షా పర్యటన

హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో రెండంకెల సీట్లు సాధించడమే ధ్యేయంగా బీజేపీ(BJP) అగ్రనాయకత్వం తెలంగాణలో పర్యటించనుంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని స్పీడప్ చేసిన బీజేపీ.. నామినేషన్లు ముగిసిన వెంటనే మరింత వేగం పెంచనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఏప్రిల్ 27న హైదరాబాద్‌కు రానున్నారు.

ఆయన తన పర్యటనలో ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలపై బీజేపీ నేతలతో చర్చించనున్నారు. హైటెక్ సిటీ నోవాటెల్‌లో ఐటీ నిపుణులతో మోదీ భేటీ కానున్నారు.


అక్షరాస్యత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఓటింగ్ శాతం పెంచడమే ధ్యేయంగా వారితో చర్చించనున్నారు. మోదీ పర్యటన తరువాత కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) సైతం రాష్ట్రానికి రానున్నారు.

ఆయన బీజేపీ కీలక నేతలకు ఎన్నికల వ్యూహాలపై చర్చించి, దిశానిర్దేశం చేయనున్నారు. ఈ లోపే బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) సైతం రాష్ట్రంలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి...

Telangana: విషాదం.. అత్తింటి వేధింపులు తాళలేక.. ఆల్ అవుట్ లిక్విడ్ తాగి..

BRS: గులాబీ పార్టీలో గుబులు.. కారు దిగేందుకు మరో ఎమ్మెల్యే సిద్ధం..?

మరిన్ని తెలంగాణ వార్తల కోసం...

Updated Date - Apr 20 , 2024 | 03:58 PM