Home » Amit Shah
‘‘మోదీకి 75 ఏళ్ల వయసు దాటాక ప్రధాని ఎవరని ప్రశ్నిస్తున్నారు. 75 ఏళ్లు దాటినా మోదీనే ప్రధానిగా ఉంటారు. 75 ఏళ్ల వయసు దాటిన తర్వాత రాజకీయాల నుంచి రిటైర్ అవ్వాలని బీజేపీ రాజ్యాంగంలో ఎక్కడా లేదు’’ అని కేంద్ర హోంమంత్రి అమిత్షా స్పష్టంచేశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో.. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మోదీ రిటైర్ అవుతారా? అంటూ చేసిన వ్యాఖ్యలపై అమిత్షా ఈ మేరకు స్పందించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రీప్లేస్మెంట్ అనేదే లేదని కేంద్ర హోం మంత్రి అమిత్షా తెలిపారు. మోదీ త్వరలోనే రిటైర్ అవుతారని, ఆయన స్థానంలో అమిత్షాను తదుపరి ప్రధానిని చేయనున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ సుప్రీం అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను అమిత్షా కొట్టిపారేశారు.
కేంద్ర హోం మంత్రి అమిత్షా శనివారం సాయంత్రం వారణాసి లోని దశాశ్వమేథ్ ఘాట్ వద్ద జరిగిన 'గంగా హారతి'లో పాల్గొన్నారు. ఆయన వెంట ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ చౌదరి ఉన్నారు.
ప్రధాని మోదీ(PM Modi) అధికారం చేపట్టిన పదేళ్లలో ఆయనపై ఒక్క అవినీతి మరక, ఆరోపణలు లేవని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amith Shah) పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన వికారాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.
అకాల వర్షాలతో ఠారెత్తించిన ఎండలు కాస్త తగ్గి వాతావరణం కొంతమేర చల్లబడినా ఎన్నికల ప్రచారంలో మాత్రం అదే ‘వేడి’! ఆ హీట్ ఇప్పుడు ‘చివరి’ అంకానికి చేరుకుంది. ఓటరు మహాశయులను ప్రసన్నం చేసుకునేందుకు హామీల కుమ్మరింతలు.. పరస్పర విమర్శలతో వివిధ పార్టీల నేతలు ఇప్పటికే చెప్పాల్సిందంతా చెప్పేసినా ఇంకా ఇంకా చెప్పాలనే తహతహతో ఉన్న వారికి మరో 24 గంటలు మాత్రమే మిగిలాయి! శనివారం సాయంత్రం 5 గంటలతో ఎన్నికల ప్రచారం ముగియనుంది.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను వక్రీకరించి, వీడియో వైరల్ చేశారన్న ఆరోపణలపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు... నిందితుల అరెస్టుపై పట్టు వదలడం లేదు. ఈ కేసు విషయమై గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. 2024 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం 132 మందికి పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే! వారిలో 67 మందికి ఏప్రిల్ 22వ తేదీన పద్మ అవార్డుల్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
2024 ఎన్నికలు రాహుల్ గాంధీకి, ప్రధాని మోదీకి మధ్య జరుగుతున్న ఎన్నికలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) వ్యాఖ్యానించారు. హోంమంత్రి యాదాద్రి భువనగిరిలోని బహిరంగ సభలో ప్రసంగించిన క్రమంలో ఈ మేరకు పేర్కొన్నారు.
Telangana: కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసుకు సంబంధించి టీపీసీసీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. అమిత్ షా వీడియో మార్కింగ్ కేసులో ఢిల్లీ పోలీసుల వేధింపులపై కోర్టు దృష్టికి టీపీసీసీ తీసుకెళ్లింది. ఈ కేసుకు సంబంధించి కాంగ్రెస్ సోషల్ మీడియాకు చెందిన 29 మంది సెక్రటరీల నివాసాలకు ఢిల్లీ పోలీసులు వెళ్లారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారం చివర దశకు చేరుకుంది. బీజేపీ అధిష్టానం అయితే తెలంగాణపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ప్రధాని మోదీ నుంచి కేంద్ర హో మంత్రి అమిత్ షా సహా బీజేపీ అగ్ర నేతలంతా తెలంగాణలో ఒకరి తర్వాత ఒకరు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఎలాగైనా పెద్ద మొత్తంలో ఎంపీ సీట్లను రాబట్టుకోవాలని బీజేపీ అధిష్టానం పట్టుదలతో ఉంది.