Home » Hyderabad
Telangana: శంషాబాద్ విమానాశ్రయంలో ఇండిగో విమానం నిలిచిపోయింది. మంగళవారం ఇండిగో 6ఏ 6707 విమానం హైదరాబాద్ నుంచి కొచ్చిన్కు వెళ్లాల్సి ఉంది. అయితే టేకాఫ్ సమయంలో ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం రన్వేపైనే నిలిచిపోయింది. దాదాపు గంట నుంచి టేకాప్ కాకుండా విమానం రన్వపై నిలిచిపోయవడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Telangana: తెలంగాణ వ్యాప్తంగా స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈవీఎం, వీవీ ప్యాట్ల స్ట్రాంగ్ రూమ్ వద్ద కేంద్ర బలగాలు మోహరించారు. ఆయా స్ట్రాంగ్ రూముల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్స్ వద్ద రౌండ్ ది క్లాక్ సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. అలాగే స్ట్రాంగ్ రూముల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది.
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ పర్యటనపై నేడు సీబీఐ కోర్టులో తీర్పు వెలువడనుంది. యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీబీఐ కోర్ట్లో సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇప్పటికే జగన్ విదేశీ పర్యటనకు వ్యతిరేకంగా సీబీఐ కౌంటర్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు యూకే వెళ్ళేందుకు అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు.
రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఊహించినట్లుగానే అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా పోలింగ్ జరిగిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో కుల ప్రాతిపదికన ఓటింగ్ జరిగింది. అలాగే ఉత్తర తెలంగాణలో ఒకలా.. దక్షిణ తెలంగాణలో మరోలా పోలింగ్ జరిగినట్లు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. అక్కడక్కడా స్వల్ప ఘటనలు మినహా అంతా ప్రశాంతంగా సాగిపోయింది. పౌరులు ఇచ్చిన తీర్పు ఓటింగ్ యంత్రాల్లో నిక్షిప్తమైంది. సోమవారం రాత్రి 11 గంటల సమయానికి రాష్ట్రవ్యాప్తంగా 64.74ు పోలింగ్ నమోదైంది. ఆలస్యంగా వచ్చి క్యూ లైన్లలో ఉన్నవారినీ పరిగణనలోకి తీసుకుని, కొన్నిచోట్ల నుంచి పూర్తి సమాచారం అందని కారణంగా పోలింగ్ శాతానికి సంబంధించిన పూర్తి వివరాలు మంగళవారం వెల్లడవుతాయని, మరో రెండు శాతం పోలింగ్ పెరిగే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.
ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ ఎన్నికల సంఘం విస్తృతంగా చేసిన ప్రచారం, స్వచ్ఛందసంస్థలు జరిపిన ర్యాలీలు, సెలబ్రిటీల సూచనలు... ఏవీ హైదరాబాద్ యువ ఓటర్లను కదిలించలేదు. చాలా వరకూ పోలింగ్ స్టేషన్లలో సగటున పది ఓట్లలో 1-2 మాత్రమే తొలి లేదా రెండవసారి (గత అసెంబ్లీ ఎన్నికలలో తొలి ఓటు వేసిన వారు) ఓటు వేస్తున్న నవతరం కనిపించింది.
పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పూర్తవ్వడానికి తెలంగాణ పోలీసుల......
పోలింగ్ బూత్ నుంచి బయటికి వచ్చిన అనంతరం ఓటర్లను ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, ఆ పార్టీ నేత ఈటల రాజేందర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై చర్యలు తీసుకోవాలని.......
త రెండు రోజుల్లో టీఎ్సఆర్టీసీ బస్సుల్లో రికార్డుస్థాయిలో 1.50 కోట్ల మంది రాకపోకలు సాగించారని ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఆయన సోమవారం కొండాపూర్ చిరాక్ పబ్లిక్ స్కూల్లోని పోలింగ్ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటేయడానికి స్వగ్రామాలకు వెళ్లిన వారికి తిరుగు ప్రయాణంలోనూ అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
పోలింగ్ బూత్ వద్ద ఓ ముస్లిం మహిళ ఓటు వేయకుండా వెనుదిరగడానికి కారణమయ్యారంటూ హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న మాధవీలతపై మలక్పేట్ పోలీసులు కేసు నమోదు చేశారు. విధులకు ఆటంకం కలిగించారంటూ.. మంగళ్హాట్ పోలీసులు కూడా ఆమెపై కేసు పెట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. మలక్పేటలోని ఆస్మాన్గఢ్ హోలీమదర్స్ గ్రామర్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్(నంబర్ 64)ను బీజేపీ అభ్యర్థి మాధవీలత సందర్శించారు.