Home » BJP
లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని.. ఎక్కడా అధికార దుర్వినియోగం జరగలేదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) అన్నారు. మంగళవారం గాంధీభవన్లో జగ్గారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. లోక్సభ ఎన్నికల్లో తాము అధికారంలో ఉన్నాం కదా అని ఎవరికి ఇబ్బంది కలిగేంచేలా ప్రవర్తించలేదని చెప్పారు.
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ దక్షిణాదిన భారీ విజయం సాధిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు.
ఉత్తరప్రదేశ్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM) మంగళవారం వారణాసి (Varanasi)లో నామినేషన్ (Namination) దాఖలు చేశారు. మోదీ సన్నిహితులు, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath), మరికొంతమంది ప్రముఖుల సమక్షంలో ఆయన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.
ఉత్తరప్రదేశ్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం వారణాసిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో దశాశ్వమేధ ఘాట్ వద్ద గంగానదికి ఆయన పూజలు చేశారు. అక్కడి నుంచి క్రూజ్లో నమో ఘాట్కు వెళ్లారు. మోదీ నామినేషన్ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు.
ఉత్తరప్రదేశ్: లోక్ సభ ఎన్నికల(Loksabha elections 2024) నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మంగళవారం ఉత్తరప్రదేశ్ లోని వారణాశి(Varanasi)లో నామినేషన్ వేయనున్నారు. ఈ ప్రక్రియను ఘనంగా నిర్వహించాలని బీజేపీ (BJP) నిర్ణయించింది.
బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ కన్నుమూశారు. ఆయన వయస్సు 72 సంవత్సరాలు.
ఎన్నికల ఫలితాల తర్వాత దేశంలో ప్రాంతీయ పార్టీలే కీలక పాత్ర పోషించబోతున్నాయని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
దేశంలో ప్రధాని మోదీకి వ్యతిరేక వేవ్ నడుస్తోందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ప్రజలు కాంగ్రె్సకు పట్టం కట్టేందుకు సిద్ధమయ్యారని చెప్పారు. సోమవారం ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి వికారాబాద్ జిల్లా కొడంగల్ ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
రాష్ట్రంలో లోక్సభ పోలింగ్ ముగిసింది. నువ్వా నేనా అన్నట్లు సాగిన త్రిముఖ పోరులో విజయం ఎవరిదనే చర్చ అన్ని పార్టీల్లో మొదలైంది. మూడు పార్టీలూ ఫలితాల పట్ల ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అత్యధిక స్థానాలు గెలుచుకుంటామని, గత నవంబరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అదృష్టం కాదని నిరూపిస్తామని కాంగ్రెస్ ధీమాగా చెబుతోంది. సోమవారం సొంత గ్రామంలో ఓటేసిన సందర్భంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ ఎన్నికల ఫలితాలు తమ ప్రభుత్వ పనితీరుకు రెఫరెండమేనని పునరుద్ఘాటించారు.
తెలంగాణలో బీజేపీ కొత్త శక్తిగా అవతరించబోతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. తమ లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రంలో డబుల్ డిజిట్ ఖాయమని స్పష్టం చేశారు. ఏపీలో ఎన్నికలు ఉండటం వల్ల కూడా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తగ్గిందని చెప్పారు.