Home » JP Nadda
బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, రాజ్యసభ మాజీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ (72) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్తో పోరాడుతున్న ఆయన చికిత్స పొందుతూ న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో సోమవారం రాత్రి 9.45 గంటలకు తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని పార్టీ రాష్ట్ర యూనిట్ సోమవారం రాత్రి ట్విటర్ వేదికగా వెల్లడించింది.
Andhrapradesh: కూటమి అభ్యర్థికి మద్దతుగా రోడ్ షోలో పాల్గొనేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా తిరుపతికి చేరుకున్నారు. తిరుపతిలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొనేందుకు జేపీ నడ్డా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇప్పటికే జ్యోతిరావు పూలే విగ్రహం వద్దకు చేరుకున్నారు. అనంతరం జేపీ నడ్డాతో కలిసి లోకేష్ రోడ్ షో నిర్వహించారు. జనసేన ఉమ్మడి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ప్రచారం కోసం ప్రత్యేక విమానంలో లోకేష్ తిరుపతికి వచ్చారు.
చిత్తూరు జిల్లా: ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం తిరుపతికి రానున్నారు. కూటమి అభ్యర్థుల విజయం కోసం ఆయన తిరుపతిలో రోడ్డు షో నిర్వహించనున్నారు. జ్యోతిరావు పులే విగ్రహం వద్ద నుంచి నాలుగకాళ్ళ మండపం వరకు రోడ్డు షో సాగనుంది.
కర్ణాటక బీజేపీ విభాగం సోషల్మీడియోలో 'అభ్యంతకర పోస్ట్' పెట్టడంపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయకు బెంగళూరు పోలీసులు బుధవారంనాడు సమన్లు పంపారు. వారం రోజుల్లోగా తమ ముందు హాజరుకావాలని అందులో కోరారు.
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లలో కోత విధించి.. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ పార్టీయేనని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ‘దొడ్డి దారిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లకు గండి కొట్టలేదని రాతపూర్వకంగా రాసిస్తారా..?’ అని ప్రధాని మోదీ కాంగ్రె్సకు సవాల్
తెలంగాణలో బీజేపీ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. బీజేపీ అగ్ర నేతలంతా రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. నేడు మూడు బహిరంగ సభల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేరుకోనున్నారు. ఉదయం 10 గంటలకు పెద్దపల్లి, ఒంటి గంటకు భువనగిరి, మధ్యాహ్నం 3 గంటలకు నల్లగొండ బీజేపీ అభ్యర్థి మద్దతుగా నడ్డా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామీ, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మతో పాటు తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు..
ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. ప్రచారానికి బీజేపీ అగ్రనేతలు తెలంగాణకు రానున్నారు. పోలింగ్కు మరో వారం మాత్రమే సమయం ఉండడంతో ప్రచారంపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇప్పటికే తెలంగాణను చుట్టేశారు. మరో రౌండ్ ప్రచారానికి మోదీ, అమిత్ షా, నడ్డా, కేంద్రమంత్రులు రానున్నారు.
భారత్లో జరుగుతున్న ఎన్నికలను వీక్షించేందుకు దేశానికి 10 దేశాలకు చెందిన 18 రాజకీయ పార్టీల నేతలు వచ్చారు. బీజేపీ ఆహ్వానం మేరకు సార్వత్రిక ఎన్నికలను వీక్షించేందుకు విదేశీ రాజకీయ నాయకులు వచ్చారు. బీజేపీ ఎన్నికల ప్రచారం, ఎన్నికల నిర్వహణ పద్ధతుల గురించి వారంతా తెలుసుకోనున్నారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఈ విదేశీ రాజకీయ నాయకులందరికీ బీజేపీ ఎన్నికల ప్రచార పద్ధతుల గురించి సవివరమైన సమాచారాన్ని అందజేస్తారు.
ప్రస్తుత పార్లమెంటు ఎన్నికలు బీజేపీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్నో, సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి కిషన్రెడ్డినో గెలిపించడం కోసం కాదని, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో వికసిత్ భారత్ సంకల్పం కోసమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా(Jagat Prakash Nadda) తెలిపారు.
కొత్తగూడెంలో ఎన్నికల ప్రచారంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి రామునికి సాష్టాంగ నమస్కారం తెలిపారు. మోదీ పాలనలోనే భారత్ శక్తి వంతంగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ పాలనలో స్కాంల విధ్వంసం తప్పదన్నారు.