Home » Telangana » Hyderabad
ఫోన్ ట్యాపింగ్ కేసులో(Phone Tapping Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు(SIB Ex Chief Prabhakar Rao) తొలిసారి ఈ కేసుపై స్పందించారు. తన వాదనలను అఫిడవిట్ ద్వారా వివరించారు ప్రభాకర్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు(Red Corner Notice) జారీ చేసే అంశంపై కోర్టులో వాదనలు జరిగాయి.
Telangana: బాచుపల్లిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో రిటర్నింగ్ వాల్ వాల్ కూలి ఏడుగురు కూలీలు మృతి చెందిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. రైజ్ కన్స్ట్రక్షన్ ఎండీ అరవింద్ రెడ్డిపై బాచుపల్లి పోలీసులు కేసు ఫైల్ చేశారు. భవన నిర్మాణంలో నాణ్యత పాటించకపోవడం, కార్మికుల విషయంలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు అంచనాకు వచ్చారు.
అకాల వర్షంతో చిగురుటాకుల వణికిన తెలంగాణ జిల్లాలకు భారత వాతావరణ శాఖ(IMD) అధికారులు మరో హెచ్చరిక జారీ చేశారు. మే 8, 9 తేదీల్లో కూడా వేర్వేరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు(Telangana Rains) కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
ABN Big Debate with Revanth Reddy: ఆగస్టు 15వ తేదీలోగా రైతుల రుణమాఫీ చేసి తీరుతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. అందరూ కేసీఆర్ లాగే ఉంటారని హరీష్ పొరపడుతున్నారని.. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసి తీరుతానని స్పష్టం చేశారు రేవంత్. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ బిడ్ డిబేట్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
ఒకే ఒక వర్షం.. హైదరాబాద్ను(Hyderabad) అతలా కుతలం చేసింది. అసలే ఉద్యోగుల పని వేళలు ముగిసి ఇంటికి బయలుదేరే సమయం. ఈ సమయంలో భారీ వర్షం(Heavy Rains) భాగ్యనగరాన్ని ముంచెత్తింది. రోడ్లపై చేరిన వర్షపు నీటితో రవాణా వ్యవస్థ(Public Transport) స్తంభించిపోయింది.
Indian Railways: దక్షిణ మధ్య రైల్వే(South Central Railways) కీలక ప్రకటన చేసింది. తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ(Lok Sabha Elections), అసెంబ్లీ ఎన్నికల పోలింగ్(Assembly Elections) జరగనున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 13, 14 వ తేదీల్లో రెండు రోజులు ప్రత్యేక రైళ్లు(Special Trains) నడపున్నట్లు ప్రకటించింది.
Heavy Rain in Hyderabad: తెలంగాణ(Telangana) రాజధాని హైదరాబాద్లో(Hyderabad) ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఒక్కసారిగా వాతావరణం(Weather) చల్లబడింది. భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. కూకట్పల్లి, KPHB, మూసాపేట్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. బాలానగర్, ఫతేనగర్, సనత్ నగర్లోనూ..
Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో(Delhi Liquor Scam Case) కోర్టుకు హాజరైన ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha).. సంచలన కామెంట్స్ చేశారు. కోర్టు హాల్ నుంచి బయటకు వెళ్తూ.. ప్రజ్వల్ రేవన్న(Prajwal Revanna) అంశంపై స్పందించారు. మహిళలపై అఘాయిత్యానికి పాల్పడిన, అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడిన జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ లాంటి వారిని విడిచిపెట్టి.. దేశం దాటించి..
దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavita) అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే రౌస్ అవెన్యూ కోర్టులో ఈ రోజు(మంగళవారం) మరోసారి ఈ కేసు విచారణ జరిగింది. ఈడీ, సీబీఐ కేసుల్లో నేటితో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో కోర్టులో దర్యాప్తు సంస్థలు హాజరుపరిచాయి.
మండే ఎండలతో, వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న భాగ్యనగర వాసులకు బేగంపేట వాతావరణ శాఖ(IMD) చల్లటి కబురు చెప్పింది. మే 7, 8 తేదీల్లో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(Hyderabad Rains) కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.