Home » Lok Sabha Election 2024
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్పై దాడి ఘటనలో ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ అంశంలో ఆయన స్పందించకపోవడం సిగ్గు చేటు అని పేర్కొంది.
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ దక్షిణాదిన భారీ విజయం సాధిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి లోక్ సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. వరసగా మూడోసారి ఇక్కడి నుంచి మోదీ బరిలోకి దిగారు. 2019, 2014లో కూడా వారణాసి నుంచి మోదీ పోటీ చేసి గెలుపొందిన సంగతి తెలిసిందే.
Telangana: తెలంగాణ వ్యాప్తంగా స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈవీఎం, వీవీ ప్యాట్ల స్ట్రాంగ్ రూమ్ వద్ద కేంద్ర బలగాలు మోహరించారు. ఆయా స్ట్రాంగ్ రూముల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్స్ వద్ద రౌండ్ ది క్లాక్ సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. అలాగే స్ట్రాంగ్ రూముల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది.
సార్వత్రిక ఎన్నికల సమరం నాలుగో దశలో 67.25 శాతం పోలింగ్ నమోదైంది. సోమవారం రాత్రి 11.45 గంటల వరకూ అందిన సమాచారం ప్రకారం..
దేశంలో ప్రధాని మోదీకి వ్యతిరేక వేవ్ నడుస్తోందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ప్రజలు కాంగ్రె్సకు పట్టం కట్టేందుకు సిద్ధమయ్యారని చెప్పారు. సోమవారం ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి వికారాబాద్ జిల్లా కొడంగల్ ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
రాష్ట్రంలో లోక్సభ పోలింగ్ ముగిసింది. నువ్వా నేనా అన్నట్లు సాగిన త్రిముఖ పోరులో విజయం ఎవరిదనే చర్చ అన్ని పార్టీల్లో మొదలైంది. మూడు పార్టీలూ ఫలితాల పట్ల ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అత్యధిక స్థానాలు గెలుచుకుంటామని, గత నవంబరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అదృష్టం కాదని నిరూపిస్తామని కాంగ్రెస్ ధీమాగా చెబుతోంది. సోమవారం సొంత గ్రామంలో ఓటేసిన సందర్భంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ ఎన్నికల ఫలితాలు తమ ప్రభుత్వ పనితీరుకు రెఫరెండమేనని పునరుద్ఘాటించారు.
తెలంగాణలో బీజేపీ కొత్త శక్తిగా అవతరించబోతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. తమ లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రంలో డబుల్ డిజిట్ ఖాయమని స్పష్టం చేశారు. ఏపీలో ఎన్నికలు ఉండటం వల్ల కూడా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తగ్గిందని చెప్పారు.
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. అక్కడక్కడా స్వల్ప ఘటనలు మినహా అంతా ప్రశాంతంగా సాగిపోయింది. పౌరులు ఇచ్చిన తీర్పు ఓటింగ్ యంత్రాల్లో నిక్షిప్తమైంది. సోమవారం రాత్రి 11 గంటల సమయానికి రాష్ట్రవ్యాప్తంగా 64.74ు పోలింగ్ నమోదైంది. ఆలస్యంగా వచ్చి క్యూ లైన్లలో ఉన్నవారినీ పరిగణనలోకి తీసుకుని, కొన్నిచోట్ల నుంచి పూర్తి సమాచారం అందని కారణంగా పోలింగ్ శాతానికి సంబంధించిన పూర్తి వివరాలు మంగళవారం వెల్లడవుతాయని, మరో రెండు శాతం పోలింగ్ పెరిగే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.
ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ ఎన్నికల సంఘం విస్తృతంగా చేసిన ప్రచారం, స్వచ్ఛందసంస్థలు జరిపిన ర్యాలీలు, సెలబ్రిటీల సూచనలు... ఏవీ హైదరాబాద్ యువ ఓటర్లను కదిలించలేదు. చాలా వరకూ పోలింగ్ స్టేషన్లలో సగటున పది ఓట్లలో 1-2 మాత్రమే తొలి లేదా రెండవసారి (గత అసెంబ్లీ ఎన్నికలలో తొలి ఓటు వేసిన వారు) ఓటు వేస్తున్న నవతరం కనిపించింది.