హనుమకొండలో ఉద్రిక్తత నెలకొంది.. GWMC కమిషనర్, మేయర్ వాహనాలను వరద బాధితులు అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
హనుమకొండలో రోజురోజుకూ వీధి కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తాయో తెలియక ప్రజలు ప్రాణాలు ఆరచేతిలో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా న్యూశాయంపేట, నయీంనగర్ లష్కర్ సింగారాల్లో ఇవాళ(ఆదివారం) వీధి కుక్కలు ఇద్దరు చిన్నారులపై దాడికి పాల్పడ్డాయి.
గొర్రెల యజమాని మేడిపల్లి రామయ్య సమాచారం మేరకు ఫారెస్ట్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దాడి చేసిన జంతువు పాదముద్రలు గుర్తించి చిరుతపులిగా నిర్ధారించారు.
హనుమకొండ నయీంనగర్లోని ఓ ప్రైవేటు స్కూల్లో విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ ఘటనతో హనుమకొండలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
రాజయ్య ఎవరికి ఫోన్ చేయబోయి ఎవరికి చేస్తే... మంత్రి పదవి ఊడిందో తెలియదా అని కాంగ్రెస్ ఎమ్మెల్యే కామెంట్స్ చేశారు. రాజయ్యను తొలగిస్తే ఆయన తరఫున తాము మాట్లాడామని గుర్తు చేశారు.
కాంగ్రెస్లో డీసీసీ అధ్యక్ష పదవి కోసం పోటాపోటీ నెలకొంది. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షినటరాజన్ పెట్టిన కొత్త నిబంధనలు పాత కాపులకు షాక్ ఇచ్చింది. మళ్లీ పార్టీ పగ్గాలు చేపట్టాలని భావిస్తున్న నేతలకు అధిష్ఠానం ఝలక్ ఇచ్చింది. ఐదేళ్ల పార్టీ సభ్యత్వం కూడా మరికొందరికి నిరాశ పరిచింది...
ప్రజాస్వామ్యబద్ధంగా వరంగల్ డీసీసీ అధ్యక్ష ఎన్నిక జరుగుతుందని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి పేర్కొన్నారు. పట్నాయక్ రిపోర్టుతోనే డీసీసీ అధ్యక్షుడిని ఏఐసీసీ గుర్తిస్తుందని చెప్పుకొచ్చారు. కొండా దంపతులకు ఓరుగల్లు ప్రజలు అండగా ఉన్నారని కొండా మురళి ఉద్ఘాటించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీల నేతలు కలిసి స్థానిక ఎన్నికలని అడ్డుకున్నారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు.
తన మీద సహచర మంత్రులు ఫిర్యాదు చేశారని నమ్మడం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. తాను అంటే ఏంటో అందరికీ తెలుసునని తెలిపారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో పేటెంట్ హక్కు రేవంత్ రెడ్డికి మాత్రమే దక్కుతుందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఉద్ఘాటించారు. తెలంగాణ సాయుధ పోరాటానికి పేటెంట్ హక్కు కమ్యూనిస్ట్ పార్టీదే అని కడియం శ్రీహరి పేర్కొన్నారు.