కాలేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల్లోని భారీ మోటార్లను నిబంధనలకు విరుద్ధంగా పదే పదే ఆన్, ఆఫ్ చేస్తూ అశాస్త్రీయంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. పంపులు, మోటార్లు పాడైపోయేలా కావాలనే ఇలాంటి కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ భవితవ్యంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై బాధితులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పసికందుకు కాలం చెల్లిన ఇంజక్షన్ను ఇవ్వడమే కాకుండా, తేదీలను మార్ఫింగ్ చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఉప్పల్ రింగ్ రోడ్డులో జిల్లాల బస్సులు ఇక ఆగవు. త్వరలో ఇక్కడి నుంచి బస్టాప్ మారనుంది.
నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన లారీ.. ముగ్గురు యువకులను ఢీకొట్టింది.
వేసవిలో డిమాండ్కు అనుగుణంగా నగరంలో 24/7 ట్యాంకర్లను సరఫరా చేయనున్నట్లు వాటర్బోర్డు ఎండీ అశోక్రెడ్డి ప్రకటించారు.
సూర్యపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో పది మంది స్వల్పంగా గాయపడ్డారు.
వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుల్కచర్ల మండలంలోని బండవెల్కిచర్ల గ్రామంలో బంగారు నగల కోసం వృద్ధురాలిని హత్య చేసి, అనంతరం సాక్ష్యాలను మాయం చేయడానికి శవాన్ని తగలబెట్టిన దారుణ సంఘటన బయటపడింది.
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి నుంచి బిహార్లోని పాట్నాకు 30 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
హైదరాబాద్లోని వనస్థలిపురం ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి.. ర్యాష్గా కారు డ్రైవింగ్ చేస్తూ బైక్ను ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న ఇద్దరు యువకులు మృతి చెందారు.