ప్రస్తుత పరిస్థితుల్లో మావోయిస్టులు చేపట్టిన సాయుధ పోరాటం కష్టంగా మారిందని ఆ పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు పసునూరి నరహరి వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్లో మాజీ మావోయిస్టులు నరహరితోపాటు ఆయన భార్య ధనమ్మను తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ సమక్షంలో మీడియా ఎదుట ప్రవేశపెట్టారు.
లొంగిపోయిన మావోయిస్టులు నరహరి దంపతులకు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ చెక్కులు అందజేశారు. నరహరికి రూ. 25 లక్షలు, ఆయన భార్య ధనమ్మకు రూ. 20 లక్షల చెక్కును డీజీపీ సీవీ ఆనంద్ అందజేశారు.
హైదరాబాద్లో కొత్తగా మరో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్(జీసీసీ) కేంద్రం ఏర్పాటు కానుంది. రీజెనరాన్.. తొలి విదేశీ జీసీసీకి తెలంగాణ ఎంపిక అయింది.
ఇందిరమ్మ ఇళ్లపేరుతో ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ మోసం చేస్తోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్రెడ్డి సర్కార్ ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తోందని ధ్వజమెత్తారు.
బీజేపీ నాయకులు చేసేది దద్దమ్మల యాత్ర అని ప్రభుత్వ విప్ వేముల వీరేశం వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకులు డ్రామా చేస్తున్నారని.. యాత్రలు చేసే వాళ్లు వస్తుంటారు, పోతుంటారని అన్నారు.
మహిళలను సంపద సృష్టించే శక్తిగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. మహిళల ఆదాయం పెరిగితే కుటుంబం బలపడుతుందని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ తాండూరు మాజీ ఎమ్మెల్యే పంజుగుల రోహిత్ రెడ్డికి చెందిన మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ పార్టీ కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. ఈ కేసును విచారిస్తున్న సిట్ అధికారులు డ్రగ్స్ సరఫరాకు సంబంధించిన మూడు ప్రధాన మార్గాలను గుర్తించారు.
హైదరాబాద్ హిల్స్ రోడ్లు డెత్ స్పాట్లుగా మారుతున్నాయి. విశాలమైన రోడ్లు, ఏటవాలుగా వేగంగా తిరిగే మలుపులు మృత్యువుకు దారితీస్తున్నాయి.
హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లి రైతుబజార్లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమాటా 35, వంకాయ 23, బెండకాయ 35, పచ్చిమిర్చి 55, బజ్జిమిర్చి 35, కాకరకాయ 38, బీరకాయ రూ.35లకు విక్రయిస్తున్నారు.
ఏపీ ప్రభుత్వం ప్రొఫెసర్ నాగేశ్వర్ను హైదరాబాద్లోనే అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తోందని.. అదే జరిగితే ఏపీ సీఎం చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తామని ...