ఎట్టకేలకు జగిత్యాల మున్సిపాలిటీ పీఠంపై సస్పెన్స్ వీడింది. జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ పీఠం ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ వర్గానికే పార్టీ అధిష్ఠానం కేటాయించింది.
ప్రేమ అనేది విశ్వాసంపై నిలిచే బంధం కానీ ఆ విశ్వాసాన్ని దుర్వినియోగం చేసే వలలో పడకుండా జాగ్రత్తగా ఉండటం యువతకు అత్యవసరం. వాలెంటైన్స్ డే ఆనందంగా జరుపుకోవాలి గానీ, ఆమ్రత్తతను మరవకూడదు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. మొత్తం ఒక కార్పొరేషన్, 7 మున్సిపాలిటీలకు గానూ.. 4 మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది.
నిజమాబాద్ జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీని కాంగ్రెస్ సొంతం చేసుకుంది. మొత్తం 12 వార్డులకు గానూ 10 స్థానాలను దక్కించుకుంది కాంగ్రెస్.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఓ సంస్థ చేసిన సర్వే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 7 మున్సిపాలిటీలకు సంబంధించి ఆ సర్వే ఫలితాలు ఇలా ఉన్నాయి.
నిజామాబాద్లో పోలీసులకు ఎంపీ ధర్మపురి అర్వింద్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పోలింగ్ కేంద్రం నుంచి బీజేపీ అభ్యర్థిని బయటకు పంపారంటూ ఎంపీకి కార్యకర్తలు సమాచారమిచ్చారు. వెంటనే పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఎంపీ.. అక్కడి ఎన్నికల సిబ్బంది, పోలీసులపై ఫైర్ అయ్యారు.
కామారెడ్డి జిల్లాలో పాడి గేదెల పేరుతో భారీ సైబర్ మోసం జరిగింది. దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామానికి చెందిన చాకలి రమేశ్ అనే రైతుని సైబర్ కేటుగాళ్లు మోసం చేశారు..
నిజామాబాద్ జిల్లాలో విధులు నిర్వహిస్తూ గంజాయి స్మగ్లర్ల దాడిలో గాయపడ్డ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ఉదంతం అత్యంత బాధాకరం. విధి నిర్వహణలో ఒక మహిళా కానిస్టేబుల్పై ఇలాంటి దాడి జరగడం సభ్య సమాజాన్ని కలిచివేస్తోంది.
నిజామాబాద్ నుంచి నిర్మల్ జిల్లాకు గంజాయిని తరలిస్తున్న ఓ ముఠా.. ఎక్సైజ్ శాఖ సిబ్బందిపై దాడి చేసింది. కారును ఆపి తనిఖీ చేయాలని ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య సహా ఇతర సిబ్బంది ప్రయత్నించగా, స్మగ్లర్లు కారును వేగంగా నడిపి పోలీస్ సిబ్బందిని ఢీకొట్టారు.
వైద్యం వికటించి రోగి మృతిచెందిన వార్తలు మనం చూస్తునే ఉంటాం. కానీ ఒకే పేరున్న మరో రోగికి ఇచ్చే మందులను పొరపాటున ఆ రోగికి మందుల చీటీలో రాసివ్వడం వల్ల ఒక వృద్ధుడు మృత్యువాత పడ్డారు. అసలేం జరిగిందంటే...