సీఎం రేవంత్రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ బహిరంగ చర్చకు పోదాం అంటున్నారని.. ఎక్కడికి రమ్మంటారో చెప్పాలని.. తాను సిద్ధమని మాజీ మంత్రి హరీష్రావు ప్రతి సవాల్ విసిరారు. అసెంబ్లీ నిర్వహించడం చేతగాక రేవంత్రెడ్డి పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. వారం రోజులకు మించి అసెంబ్లీ నడిపే పరిస్థితి లేదని హరీష్రావు పేర్కొన్నారు.
బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్రావుని చంపేస్తామని పీపుల్స్ వార్ మావోయిస్టుల పేరుతో ఫోన్ చేసి బెదిరించారు. సోమవారం సాయంత్రంలోగా చంపుతామంటూ ఎంపీని హెచ్చరించారు. తాను మధ్యప్రదేశ్కి చెందిన మావోయిస్టునని బెదిరింపులకు పాల్పడ్డాడు.
Placards Controversy: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ రైతులకు రైతు భరోసా ఇవ్వాలంటూ జిన్నారంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ధర్నాకు దిగారు. అయితే బీఆర్ఎస్ ధర్నాలో రప్పా.. రప్పా ప్లకార్డులు దర్శనమిచ్చాయి.
రాష్ట్రంలో కేడీలు, బేడీల రాజ్యం నడుస్తోందని మాజీ మంత్రి హరీష్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్ములా వన్ రేస్ని రాష్ట్రానికి తెచ్చిన మాజీ మంత్రి కేటీఆర్ని కూడా రేవంత్ ప్రభుత్వం సతాయించిందని హరీష్రావు అన్నారు.
సిద్దిపేటలో అడ్వాన్స్ టెక్నాలజీతో స్కిల్ డెవలప్మెంట్ని ప్రారంభిస్తామని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కంకణం కట్టుకుందని వివేక్ వెంకటస్వామి అన్నారు.
బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఒక్కరోజైనా బీసీ బిల్లు గురించి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో మాట్లాడారా అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. బీసీ బిల్లు వస్తే ఉద్యోగాలు, రాజకీయ అవకాశాలు, నిధులు వస్తాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు.
కేసీఆర్, కేటీఆర్, కవితలది ఇంటి సమస్య, పైసల పంచాయితీ, రాజకీయ వారసత్వ పంచాయితీ అని ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. కవిత ఏం మాట్లాడుతుందో ఆమెకే తెల్వదని ఎంపీ రఘునందన్రావు విమర్శించారు.
కాంగ్రెస్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్దామని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. వచ్చే ఎన్నికలనూ దృష్టిలో పెట్టుకొని గ్రామ గ్రామాల్లో కాంగ్రెస్ జెండా ఎగిరే విధంగా ప్రణాళిక రూపొందించుకొని ముందుకు వెళ్తామని తెలిపారు.
ప్రజలను చైతన్యం చేయడంలో సీపీఐ తన కర్తవ్యాన్ని నిర్వహిస్తోందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఉద్ఘాటించారు. కేంద్రప్రభుత్వం ఉగ్రవాదులతో చర్చల కోసం సిద్ధంగా ఉన్నది కానీ నక్సలైట్లతో చర్చలకి ఎందుకు ముందుకు రావడం లేదని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రశ్నల వర్షం కురిపించారు.
Medak Syrup Tragedy: మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జలుబు, దగ్గుతో బాధపడుతున్న ఐదుగురు చిన్నారులకు తల్లి సిరప్ తాగించింది. ఆ వెంటనే ఆ చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు.