సింగరేణి కార్మికుల సమస్యలు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రభుత్వానికి పట్టవా అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని భరోసా కల్పించారు.
గంజాయి బ్యాచ్లను ఖమ్మంకు దూరం చేయాలని ఎన్నికల సమయంలో ప్రజలు అడిగారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలో గంజాయి కూడా లేకుండా చేస్తా అని స్పష్టం చేశారు.
పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు ఎలాగైనా గెలవాలని రకరకాల ప్రలోభాలు చేయడం ముమ్మరంగా జరుగుతోంది. డబ్బు, మద్యం పంచడం, బెదిరించడం, తప్పుడు ప్రచారం చేయడం వంటి చర్యలు నేరంగా పరిగణస్తారు. ఎన్నికల సమయంలో ఈ ప్రవర్తనలకు కఠిన శిక్షలు, జరిమానాలు విధిస్తారు.
ఓట్ల కోసం కాసుల వేట మొదలైంది. మొదటి విడత ఎన్నికలకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుండడంతో... ఉమ్మడి జిల్లాలో పంచాయతీ బరిలో ఉన్న అభ్యర్థులకు 'డబ్బు' టెన్షన్ మొదలైంది. ఇప్పటికే వార్డు సభ్యులు, సర్పంచ్ అభ్యర్థులు సొమ్ముల వేట మొదలెట్టారు.
డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలను కాంగ్రెస్ ఇచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. నిరుపేదలకు రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యాన్ని అందించిన ఘనత తమ ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు.
కుట్రతోనే బీఆర్ఎస్ నుంచి తనను బయటకు పంపించారంటూ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను.. తన కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీకి దూరం చేశారన్నారు.
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జాగృతి అధ్యక్షురాలు కవిత పోరాటానికి సిద్ధమయ్యారు. డిసెంబర్ 13న సింగరేణి సీఎండీ ఆఫీస్ ముట్టడికి పిలుపునిచ్చారు.
జాగృతి జనం బాటలో భాగంగా ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించేలా ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తనపై ఆరోపణలు చేస్తున్న వ్యక్తులని దీర్ఘకాలం ఎవరూ రక్షించలేరని హెచ్చరించారు.
స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ప్రయత్నం చేయడం లేదని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ఈ బిల్లు ఆమోదం లేకుండా ఎన్నికలకు వెళ్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
పినపాక అభివృద్ధి కోసం ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసిన దాడి సిగ్గుమాలిన చర్య అని రేగా కాంతారావు పేర్కొన్నారు.