ఆయుధ విరమణపై మావోయిస్టు పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జనవరి 1వ తేదీన సాయుధ కాల్పులను విరమిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో ప్రకటన విడుదల చేశారు.
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్పై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. డిసెంబర్ 5వ తేదీ లోపు ప్రత్యక్షంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. లేకుంటే నాన్ బెయిలబుల్ ఆదేశాలు జారీ చేస్తామని హెచ్చరించింది.
హైదరాబాద్ లోని ఓ ఇంట్లో వాషింగ్ మిషన్ పేలడం కలకలం రేపింది. ఈ పేలుడు ధాటికి జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ పేలుడులో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.
బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్కు లేదని మంత్రి సీతక్క వ్యాఖ్యలు చేశారు. బీసీల రిజర్వేషన్లను తగ్గించిందే బీఆర్ఎస్ అంటూ మండిపడ్డారు.
సిగాచీ పేలుళ్ల ఘటనపై హైకోర్టు సీజే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు బాధ్యులెవరినీ గుర్తించలేదా అంటూ సీజే సీరియస్ అయ్యారు.
సీసీ కెమెరాల నిర్వహణకు ప్రత్యేక బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎంపవరింగ్ ఎవ్రీ డే సేఫ్టీ టీమ్స్ అంటూ నామకరణం చేసిన ఈ బృందాలను సీపీ సజ్జనార్ ప్రారంభించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డిని గురువారం విచారణ చేశారు.
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు తాము తెచ్చిన ఇండస్ట్రీయల్ పాలసీ అర్థం కాలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రతిపక్షాల నేతలు కావాలనే తమ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహితంగా మార్చేందుకు ఇండస్ట్రీలను ORR బయటకు పంపాలనే డిమాండ్ ఉందని గుర్తుచేశారు.
ఐబొమ్మ రవిని మరోసారి సీసీఎస్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మూడు రోజుల పాటు రవిని విచారించనున్నారు.
దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ ఫ్యాక్టరీ స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ను ప్రారంభించినట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. స్పేస్ సెక్టార్లో కో-ఆపరేటివ్, ఎకో సిస్టమ్ను తీసుకొచ్చామని పేర్కొన్నారు.