H- సిటీ ప్రాజెక్టులో భాగంగా రూ.1300 కోట్ల వ్యయంతో కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లైఓవర్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీపీ వీసీ సజ్జనార్ వ్యాఖ్యానించారు.
హైదరాబాద్లోని అత్తాపూర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి చెందిందంటూ ఓ ప్రైవేటు ఆస్పత్రి వద్ద బంధువులు ఆందోళనకు దిగారు.
అత్యంత రద్దీగా ఉండే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పరిధిలోని కేబీఆర్ పార్క్ చుట్టూ నేటినుంచి ‘వన్ వే’ అమలు కానుంది.
హైదరాబాద్లో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్వే ట్రాఫిక్ విధానం మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. H-City ప్రాజెక్ట్ పనుల దృష్ట్యా ఈ పార్క్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకే తెలంగాణ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ ప్రజా పాలనలో విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంతో పాటు, పేదలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
తెలంగాణలో రాష్ట్ర ఎన్నికల సంఘం SIR ముసాయిదాను విడుదల చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా 78.30 శాతం ఎన్యూమరేషన్ పత్రాలు అందినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి తెలిపారు. సుమారు 92 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయనున్నట్లు వెల్లడించారు.
సామాన్యులను 22-A పేరుతో ఇబ్బంది పెడితే సహించేది లేదని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి హెచ్చరించారు. ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పడం, ఆయా సమస్యల్లో జాప్యం చేస్తే ఇకపై సహించబోమని వార్నింగ్ ఇచ్చారు.
ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్కు బిగ్ షాక్ తగిలింది. ఈ మేరకు బోరబండ పోలీస్ స్టేషన్లో బీజేపీ నాయకులు ఆమెపై కేసు నమోదు చేశారు.
హైదరాబాద్లోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. ప్రియురాలిని ప్రియుడు హత్య చేసినట్లు తెలుస్తోంది. ప్రియురాలిపై అనుమానమే ఈ హత్యకు కారణమని బాలాపూర్ పోలీసులు భావిస్తున్నారు.
హైదరాబాద్లోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుప్పల్ శ్రీ సాయిరామ్ నగర్లో విషాద ఘటన చోటుచేసుకుంది. 29 ఏళ్ల సాఫ్ట్వేర్ ఉద్యోగి రేగు మహేశ్ బలవన్మరణానికి పాల్పడ్డాడు.