సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై ఈరోజు(సోమవారం) నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా టాలీవుడ్ హీరో అల్లుఅర్జున్కు వర్చువల్గా అటెండ్ అయ్యేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.
హైదరాబాద్ పాతబస్తీలో దారుణ హత్య కలకలం రేపింది. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫహద్ బిన్ అబ్దుల్ రెహ్మాన్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తి హత్య చేశాడు.
తెలంగాణ కాంగ్రెస్ అండతోనే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ బరితెగించి మాట్లాడుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. హైకోర్టునే బెదిరించేలా ఒవైసీ వ్యాఖ్యలు చేస్తున్నారని, అడ్డగోలుగా తప్పులు చేస్తూ ఇప్పుడు కోర్టునే ప్రశ్నించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో హైదరాబాద్ నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి నగరంలో సవాళ్లు వెక్కిరిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. చిన్న వర్షం పడినా ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు.
వ్యవసాయంలో సాంకేతిక విప్లవానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్లో వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ.. ఫర్టిలైజర్ యాప్కు రైతుల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని అన్నారు.
తెలంగాణలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ సహా మరి కొన్ని జిల్లాల్లో రెండ్రోజుల పాటు అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
పదేళ్లలో తెలంగాణ ప్రజల జీవితాలను బీఆర్ఎస్ తాకట్టు పెట్టిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లలో నీటి పారుదల శాఖను నాశనం చేశారని ధ్వజమెత్తారు.
కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, మనోహర్ లాల్ ఖట్టర్లకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 గురించి వివరించారు.
హైదరాబాద్లో హరియాణా పోలీసులు నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్లో దోపిడీ కేసుకు సంబంధించిన ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన నగరంలో చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు త్వరలో భారీ స్థాయిలో పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది.