ఐదు రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికల్లో భాగంగా పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మహానగరం పాత బస్తీలో నివసిస్తున్న బెంగాలీ కుటుంబాలతో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్ మహానగరంలో విద్యార్థినిపై అత్యాచారయత్నం జరిగింది. చిన్నారిని కిడ్నాప్ చేసి అత్యాచారయత్నం చేశాడు ఓ కామాంధుడు. గోల్కొండ ప్రాంతంలో పాఠశాల నుంచి ఇంటికి వెళ్లేందుకు విద్యార్థిని(8) ఆటో ఎక్కింది.
తెలంగాణ ప్రభుత్వంపై కేరళ సీఎం పినరయి విజయన్ విమర్శలపై సీఎం రేవంత్ రెడ్డి సోమవారం హైదరాబాద్లో స్పందించారు. తెలంగాణ అభివృద్ధిపై మీతో చర్చకు తాను సిద్ధమని కేరళ సీఎం పినరయి విజయన్కి సీఎం రేవంత్ సవాల్ చేశారు.
మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో నిందితుల కస్టడీ, బెయిల్ పిటిషన్లపై సోమవారం ఉప్పరపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ కేసులో తీర్పును మంగళవారానికి కోర్టు వాయిదా వేసింది.
కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు నేపథ్యంలో బంజారా సమాజం కోసం ఏం చేయాలనే దానిపై ఆ సామాజికవర్గ నేతలతో కల్వకుంట్ల కవిత చర్చించారు. వారికి ఏం చేస్తే అభివృద్ధి చెందుతారో అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు.
వేసవి సెలవుల్లో కార్పొరేట్ కాలేజీలు క్లాసులు నిర్వహిస్తున్నాయంటూ నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు పీడీఎస్యూ ధర్నాకు దిగింది. విద్యాహక్కు చట్టానికి విరుద్ధంగా అడ్మిషన్లు కొనసాగిస్తున్న కాలేజీలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేసింది.
సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ విప్ వేముల వీరేశం ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ప్రభుత్వ విప్ పేర్కొన్నారు.
విజిలెన్స్ అధికారులమంటూ గ్యాస్ డెలివరీ బాయ్ను బెదిరించి డబ్బులు వసూలు చేసిన యూట్యూబర్స్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.23 వేల నగదును రికవరీ చేశారు.
సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ ఖాతాల వివరాలు అందజేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కమీషన్ల కోసం బ్యాంక్ ఖాతాలను నేరగాళ్లకు ఇచ్చి, అక్రమ లావాదేవీలకు సహకరిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.
ఎక్కడో పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రభావం రాష్ట్రంలోని మందుబాబుల జేబులపై పడనుంది. అవును రాష్ట్రంలోని మద్యం ప్రియులపై ఈ వేసవిలో ధరల బాంబు పడబోతుంది.