తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పదేళ్లు పూర్తి కావడం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవడంతో రాష్ట్రవ్యాప్తంగా 'ప్రజా పాలన ఉత్సవాలు' ఘనంగా జరుగనున్నాయి. డిసెంబర్ 1 నుంచి 9 వరకు..
డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. అభివృద్ధి చెందిన తెలంగాణను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. భవిష్యత్ కోసం పారదర్శక పాలసీలు తెస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆదివారం బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు కేటీఆర్.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన జాగృతి జనంబాట యాత్రను డిసెంబర్ 4వ తేదీ నుంచి కొనసాగించనున్నారు. అక్టోబర్ 25వ తేదీన నిజామాబాద్లో కవిత జనంబాట యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే.
దేశంలో పంట నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా చట్టాల్లో మార్పులు తీసుకురావాలని అఖిలపక్ష సమావేశంలో కోరామని బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్రెడ్డి పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పేపర్లకే పరిమితం అవుతుంది కానీ రైతులకు న్యాయం జరగడం లేదని చెప్పుకొచ్చారు. 16వ ఫైనాన్స్ కమిషన్ నివేదికపై పార్లమెంట్లో చర్చ జరగాలని కోరారు.
హైదరాబాద్ అమీర్పేట్లోని ఓ ఇంటి బాల్కానీలో గురువారం వాషింగ్ మెషిన్ పేలిన ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. భారీ శబ్దంతో మెషిన్ పేలడంతో.. వాషింగ్ మిషన్ తునాతునకలైపోయింది. వాషింగ్ మెషిన్ రన్నింగ్లో ఉండగా ఈ పేలుడు సంభవించింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జిల్లాల పర్యటనలు చేయడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శలు గుప్పించారు. ఎన్నికలు గ్రామాల్లో ఉంటే .. జిల్లా కేంద్రాలకు వెళ్లి ముఖ్యమంత్రి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారా అని ఎద్దేవా చేశారు.
తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ పర్వం శనివారంతో ముగిసింది. నేటి నుంచి రెండో విడత ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో మరిన్ని మున్సిపాల్టీలు, పంచాయితీలను విలీనం చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. దీంతో నగర విస్తీర్ణం మరింత పెరగనుంది. ఈ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా.. పలువురు నిపుణులు కీలక అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగానే గాక, దక్కన్ చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైన ప్రభువుగా పేరు పొందిన ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ అమితమైన కళారాధకుడు, సాహిత్యప్రియుడు కూడా. హైదరాబాద్లో వేసవి ఉష్ణోగ్రతలు నానాటికీ పెరుగుతున్నాయన్న కారణంగా చల్లని ప్రదేశంలో విడిది కేంద్రాన్ని నిర్మించాలని తలచాడు.