హైదరాబాద్లోని చర్లపల్లిలో తల్లీబిడ్డల ఆత్మహత్య కేసులో జీఆర్పీ పోలీసులు దర్యాప్తు పూర్తి చేశారు. ముగ్గురి ఆత్మహత్యలో మరొకరి ప్రమేయం లేదని పోలీసులు నిర్ధారించారు.
ఎండలు క్రమంగా పెరుగుతుండడంతో విద్యుత్ డిమాండ్ సైతం పైపైకి వెళ్తోంది. సాధారణంగా వచ్చే బిల్లుల కంటే వేసవిలో అదనంగా వస్తుంటాయి. ఈ నేపథ్యంలో రీడింగ్ రాని విద్యుత్ మీటర్లపై దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) దృష్టి పెట్టింది.
విలీనం, విస్తరణ.. తాజాగా జరిగిన విభజన నేపథ్యంలో సర్కిల్, జోనల్ కార్యాలయాల్లో పాలన గాడిన పడలేదు. రెండున్నర నెలల క్రితమే వార్డులు, సర్కిల్, జోనల్ కార్యాలయాల పునర్ వ్యవస్థీకరణ జరిగింది.
నెలవంక బుధవారం కనబడడంతో ఇషా నమాజ్ అనంతరం మక్కా మసీదులో తర్వా నమాజ్ ప్రారంభమైంది. పాతబస్తీ ముస్లింలు మొదటి పది రోజులు తర్వా నమాజ్ మక్కా మసీదులో చదవడానికి ప్రాధాన్యం ఇస్తారు.
హైదరాబాద్ జిల్లాలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా కల్పించారు. L1 కింద 4,800 మందికి రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి నిధులు ఇచ్చామని స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో రోడ్లు, భవనాల శాఖ కీలక పాత్ర పోషిస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వ్యాఖ్యానించారు. స్పష్టమైన ప్రణాళికతో వార్షిక బడ్జెట్ అంచనాలు ఉండాలని అధికారులను ఆదేశించారు.
ధరణి దోపిడీపై ఉక్కుపాదం మోపుతామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ధరణి వ్యవహారంలో తీగ లాగితే డొంక కదిలినట్లు అక్రమాలు బయటపడుతున్నాయని చెప్పుకొచ్చారు.
భాగ్యనగర పరిశుభ్రతలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ని పరిశుభ్రంగా ఉంచాలని దిశానిర్దేశం చేశారు.
హైదరాబాద్లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను మహేశ్ అనే వ్యక్తి కత్తితో పొడిచి చంపేశాడు.
హైదరాబాద్లోని పాతబస్తీలో దారుణం జరిగింది. మద్యానికి బానిసైన భర్తను భార్య చున్నీతో గొంతు బిగించి చంపేసింది.