బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో విశేష ప్రగతి సాధించిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు వ్యాఖ్యానించారు. పంజాబ్ను మించి ధాన్యం ఉత్పత్తి చేసి తెలంగాణ రికార్డులు సృష్టించిందని పేర్కొన్నారు.
ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ చరిత్రాత్మక రికార్డ్ సాధించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. 8,575 కొనుగోలు కేంద్రాల నుంచి 46.21 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు.
కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ‘TRS’ పేరుతో రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ కోసం బహిరంగ ప్రకటన వెలువడటం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. కల్వకుంట్ల కవిత, ఆమె భర్త అనిల్ కుమార్ కలిసి ‘తెలంగాణ రక్షణ సేన’ పేరుతో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
తెలంగాణలో గోవధ నిషేధ చట్టాలు ఉల్లంఘనకు గురవుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్లో గోవుల అక్రమ రవాణా, వధ జరుగుతోందని అన్నారు.
కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గురువారం ఢిల్లీలో కలిశారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై ఇరువురు చర్చించారు. తెలంగాణలో రైల్వేప్రాజెక్టుల పురోగతి, కొత్త ప్రాజెక్టులు, ఎలక్ట్రిఫికేషన్ తదితర ప్రాజెక్టులపై మాట్లాడారు.
ఉప్పల్ స్టేడియం వేదికగా శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు భారీ డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం టికెట్ల బ్లాక్ మార్కెట్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కోసం అధినేత కేసీఆర్ ఇన్ఛార్జిలను ప్రకటించారు. డిజిటల్ ప్రక్రియలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు జరగనుంది.
కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ కేసుపై కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షినటరాజన్ స్పందించారు. ఈ కేసుపై వస్తున్న వ్యాఖ్యలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
కార్మికులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. కనీస వేతనాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కీలక విషయాలను వెల్లడించారు.
కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్తో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు. మొక్కజొన్న, జొన్న పంటలను పీఎస్ఎస్ స్కీంలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు.