అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని గిరిజనుల పునరావాసానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొదటి దశలో నాలుగు గ్రామాలకు చెందిన వందలాది కుటుంబాలకు పరిహారం అందిస్తూ పునరావాస ప్రక్రియను ప్రారంభించింది.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ ఏర్పాటుపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈనెల 27న శ్రీరామనవమి రోజు పార్టీకి సంబంధించిన అధికారిక ప్రకటన చేసే అవకాశముందని సమాచారం.
అసెంబ్లీ లాబీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల విషయంలో హామీలు నిలబెట్టుకోలేదని ఆరోపిస్తూ, నిరుద్యోగులను మోసం చేసిందని అన్నారు.
తెలంగాణలో చికెన్ వ్యాపారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పౌల్ట్రీ కంపెనీల విధానాలకు వ్యతిరేకంగా ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులను బంద్ చేస్తున్నట్లు చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది.
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందనే వార్తల నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. ఎలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని, రాష్ట్రంలో ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని తెలిపారు.
బీఆర్ఎస్ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటే తప్పేమిటని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అలాగే హైదరాబాద్లో ఓటింగ్ శాతం తగ్గిపోవడానికి కారణాలపై కూడా ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
అసెంబ్లీ లాబీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కడియం శ్రీహరిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేవాదుల ప్రాజెక్టు సృష్టికర్త తానేనని కడియం చెప్పుకోవడం సరైంది కాదని ఆయన అన్నారు.
రాష్ట్రంలో గృహ నిర్మాణ పనులపై శాసనసభలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటనలు చేశారు. గత ప్రభుత్వాలు ప్రారంభించిన ఇళ్ల నిర్మాణాల్లో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు.
99 రోజుల ప్రణాళికలో పూర్తయిన డబుల్ బెడ్ రూం ఇళ్లను పేదలకు కేటాయిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. బుధవారం అసెంబీలో ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమైంది. ఈ సందర్భంగా డబుల్ బెడ్ రూం ఇళ్లపై చర్చ జరిగింది.
పార్టీ మారలేదన్న ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. అలాగే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు సైతం కోర్టు నోటీసులు ఇచ్చింది.