హైదరాబాద్లో ఓ బాలుడి హత్య కేసులో కూకట్పల్లి కోర్టు సంచలన తీర్పునిచ్చింది. చిన్నారిని హత్య చేసిన వ్యక్తికి మరణశిక్ష విధించింది.
కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం భగీరథ్కు నోటీసులు జారీ చేసింది.
కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ కేసులో బాధితురాలికి న్యాయం చేయాలని మాత్రమే తాను మాట్లాడానని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ కేసులో బాధితురాలికి న్యాయం చేసే అంశంపైనే తాను మాట్లాడానని.. తన మాటలను కొంతమంది వక్రీకరించారని పేర్కొన్నారు.
తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగిస్తున్నారంటూ ఢిల్లీ హైకోర్టును సినీ నటుడు అక్కినేని నాగార్జున ఆశ్రయించారు. ఓ బట్టల వ్యాపారి దుస్తులపై తన చిత్రాలు, పేరు వాడుతున్నాడని కోర్టు దృష్టికి నాగార్జున తీసుకెళ్లారు.
బీఆర్ఎస్ ముఖ్య నేతలతో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ దాదాపు ఐదు గంటలుగా కొనసాగుతోంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ వివిధ అంశాలపై పార్టీ నేతలతో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు.
తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ వాఖ్యలను టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఖండించారు. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ కేసు వ్యవహారంలో మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని స్పష్టం చేశారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల డిమాండ్ నేపథ్యంలో నిర్వహించిన రైల్ రోకో కార్యక్రమం కేసులో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు సమన్లు జారీ అయ్యాయి. రేపు విచారణకు హాజరు కావాలని సికింద్రాబాద్ రైల్వే కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
రబీ వరి కొనుగోళ్లపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వరి అన్లోడింగ్ హమాలీ ఛార్జీలు రూ.6.50 నుంచి రూ.8.50కి పెంచింది. రాష్ట్రవ్యాప్తంగా వరి కొనుగోళ్లకు అంతరాయం లేకుండా కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలోని నర్సులకు విదేశాల్లో ముఖ్యంగా జర్మనీలో అద్భుతమైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి వివేక్ వెంకటస్వామి వ్యాఖ్యానించారు. మంగళవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక సమావేశంలో 'ట్రిపుల్ విన్' ప్రోగ్రాం వివరాలను వెల్లడించారు.
నీట్ పరీక్ష రద్దుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, కేంద్ర మానవ వనరుల శాఖ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బాధ్యత వహించాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష రద్దుతో విద్యార్థులు తమ అకడమిక్ ఇయర్ను కోల్పోయే అవకాశం ఉందన్నారు.