• Home » Telangana » Hyderabad

హైదరాబాద్

పెరిగిన పచ్చిమిర్చి, కాకర ధరలు.. తగ్గిన టమాటా

పెరిగిన పచ్చిమిర్చి, కాకర ధరలు.. తగ్గిన టమాటా

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమాటా రూ. 11, వంకాయ 23, బెండకాయ 28, పచ్చిమిర్చి 45, బజ్జీమిర్చి 23, కాకరకాయ 38, బీరకాయ 38, క్యాబేజీ 13, బీన్స్‌ 28లకు విక్రయిస్తున్నారు.

హైదరాబాద్‏లో నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలు..

హైదరాబాద్‏లో నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలు..

బంజారాహిల్స్‌ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ జి.గోపీ తెలిపారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు 11కేవీ ఐఓఏ, జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్‌.22 ఫీడర్ల పరిధిలో విద్యుత్‌ సరఫరా ఉండదని తెలిపారు.

వాట్సాప్ మీ సేవకు అత్యధిక ప్రజాదరణ: తెలంగాణ ప్రభుత్వం

వాట్సాప్ మీ సేవకు అత్యధిక ప్రజాదరణ: తెలంగాణ ప్రభుత్వం

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వాట్సాప్ మీ సేవ విధానానికి అత్యధిక ప్రజాదరణ లభించిందని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు 3.25 లక్షల మందికి డిజిటల్ పౌర సేవలు అందినట్లు వివరించింది.

భారత చిత్ర పరిశ్రమకు హైదరాబాద్ వేదిక కావాలి: డిప్యూటీ సీఎం

భారత చిత్ర పరిశ్రమకు హైదరాబాద్ వేదిక కావాలి: డిప్యూటీ సీఎం

గద్దర్ పేరు మీద అవార్డులను రెండో ఏడాది ఇస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఉగాది పర్వదినం రోజు.. ఈ అవార్డుల ప్రదానోత్సవం ఉంటుందని తెలిపారు.

ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు.. మూడు వారాల్లోగా నిర్ణయం తీసుకోండి.. అసెంబ్లీ స్పీకర్‌కి సుప్రీంకోర్టు ఆదేశం

ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు.. మూడు వారాల్లోగా నిర్ణయం తీసుకోండి.. అసెంబ్లీ స్పీకర్‌కి సుప్రీంకోర్టు ఆదేశం

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన కేసు విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. ఈ కేసుపై జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ లతో కూడిన ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది.

మరో మూడు నెలల్లో కొత్త రాజకీయ పార్టీ ప్రకటన: కవిత

మరో మూడు నెలల్లో కొత్త రాజకీయ పార్టీ ప్రకటన: కవిత

మరో మూడు నెలల్లో కొత్త రాజకీయ పార్టీని ప్రకటిస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వెల్లడించారు. సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నానని ఆమె చెప్పారు.

భాగ్యనగరంలో రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్.!

భాగ్యనగరంలో రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్.!

హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధి నందగిరి హిల్స్‌లోని ఓ ఇంట్లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఇంట్లో విలువైన బంగారు ఆభరణాలను దొంగలు దోచుకెళ్లారు. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

విజయశాంతి రెడ్డి సూసైడ్ కేసులో కీలక మలుపు.. లాస్ట్ కాల్‌‌ ఆధారంగా..

విజయశాంతి రెడ్డి సూసైడ్ కేసులో కీలక మలుపు.. లాస్ట్ కాల్‌‌ ఆధారంగా..

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ విజయశాంతి రెడ్డి, తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. విజయశాంతి రెడ్డి లాస్ట్‌ కాల్‌ను తన సోదరుడికి చేసినట్లు గుర్తించిన పోలీసులు.. దాని ఆధారంగా విచారణ చేపట్టారు.

కలర్, జెండర్‌ ఆధారంగా రేట్ ఫిక్స్.. చైల్డ్ ట్రాఫికింగ్‌లో షాకింగ్ నిజాలు

కలర్, జెండర్‌ ఆధారంగా రేట్ ఫిక్స్.. చైల్డ్ ట్రాఫికింగ్‌లో షాకింగ్ నిజాలు

చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ముఠా.. శిశువు కలర్, జెండర్ ఆధారంగా రేట్లను నిర్ణయిస్తున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది.

నటుడు చంద్రహాస్‌పై మరో కేసు నమోదు..

నటుడు చంద్రహాస్‌పై మరో కేసు నమోదు..

యువ నటుడు చంద్రహాస్‌పై జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు పోలీసులు. ఓ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి