తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. అయితే నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో ఓ అభ్యర్థి మృతిచెందడంతో ఆరో వార్డులో పోలింగ్ను వాయిదా వేశారు అధికారులు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం విడుదలైన అధికారిక ఉత్తర్వుల ప్రకారం పలు ప్రధాన శాఖల్లో ఉన్నతాధికారుల మార్పులు చోటుచేసుకున్నాయి..
తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. ఈ మున్సిపల్ కార్పొరేషన్లకు తాజాగా కొత్త కమిషనర్లను నియమించింది..
గ్రేటర్ జోన్ పరిధిలోని అన్ని ఆర్టీసీ డిపోల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి తీసుకువచ్చేలా ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఇప్పటికే కంటోన్మెంట్, మియాపూర్, రాణిగంజ్, హయత్నగర్, హెచ్సీయూ డిపోల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు నడుస్తున్నాయి.
నగరంలో పగటిపూట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయని, సమ్మర్ డిమాండ్ మొదలైందని, వేసవిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) సీఎండీ ముషారఫ్ ఫారూఖీ తెలిపారు.
టీజీఎస్పీడీసీఎల్ వసంతనగర్ సెక్షన్ పరిధి జేఎన్టీయూ 33/11కేవీ సబ్స్టేషన్లో నిర్వహణ పనుల కోసం బుధవారం పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఏఈ వాణి ఓ ప్రకటనలో తెలిపారు.
తెలంగాణలోని మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల ప్రక్రియ కీలక ఘట్టానికి చేరుకుంది. రాష్ట్రంలోని 116 మునిసిపాలిటీలు, ఏడు కార్పోరేషన్ల పరిధిలోని వార్డు, డివిజన్లకు బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 ....
సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రేపు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని ఫ్యాక్టరీలు, షాపులు, పరిశ్రమలకు సెలవు వర్తించనుంది..
హైదరాబాద్ శివారులో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. గాజులరామారంలో భారీ శబ్దంతో భూమి కంపించింది. మెట్కాన్గూడెం పరిసరాల్లో కూడా భూ ప్రకంపనలు సంభవించాయి..