జీఆర్ఎంబీ అజెండాపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ నెల 18వ తేదీన జీఆర్ఎంబీ 18వ సమావేశం జరగనుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని భారత ఆర్మీ సదరన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ సి.రాజేష్ పుష్కర్ మర్యాదపూర్వకంగా కలిశారు.
ప్రముఖ సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ భుజానికి సికింద్రాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో బుధవారం శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి అయిందని కిమ్స్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
సివిల్ సప్లయిస్ శాఖలో డిఫాల్ట్ అయిన రైస్మిల్లర్ల నుంచి బకాయిలను వసూల్ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. బకాయిల వసూళ్లకు ఒక విధానాన్ని రూపొందించాలని దిశానిర్దేశం చేశారు.
కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్తో కాంగ్రెస్ ఎంపీలు భేటీ అయ్యారు. తెలంగాణలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి వికారాబాద్-కృష్ణా కొత్త రైల్వే లైన్కు త్వరితగతిన అనుమతులు ఇచ్చి, పనులను వేగవంతం చేయాలని ఎంపీలు కోరారు.
తెలంగాణ నీటి వాటా విషయంలో ఎక్కడా రాజీ పడబోమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. నీటి వాటాల్లో తెలంగాణకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర నష్టం చేసిందని విమర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు భూకుంభకోణాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలు గుప్పించారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘ఇన్నోవేటర్ ఆఫ్ ది సెంచరీ’గా అనుముల కొండల్ రెడ్డిని ప్రకటించాలని ఎద్దేవా చేశారు.
హైదరాబాాద్ పంజాగుట్ట శ్మశాన వాటికలో పసికందు మృతదేహం మాయం కేసులో దర్యాప్తును బంజారాహిల్స్ పోలీసులు ముమ్మరం చేశారు. ఘటనా స్థలంలో ఆధారాలను క్లూస్ టీంతో వారు సేకరించారు.
హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ సాయి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పీఎస్లోని రెస్ట్ రూమ్లో గత రాత్రి అతడు ఆత్మహత్య చేసుకున్నాడు.
జీనోమ్ వ్యాలీలో ‘యామ్జెన్’ అత్యాధునిక పరిశోధన కేంద్రం ఏర్పాటు కానుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో యామ్జెన్ ఎంఓయూ కుదుర్చుకుంది. తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది.