నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు- కంటైనర్ లారీ ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కారు అదుపు తప్పి దూసుకెళ్లడంతో ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది.
మున్సి పల్ ఎన్నికలకు సంబంధించిన వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు కావటంతో జిల్లాలో ఆయా పార్టీల్లో రాజకీయ సమీకరణలు తెరపైకి వచ్చాయి. ఈ సారి మున్సి పల్ ఎన్నికల్లో పోటీ పార్టీల మధ్య కంటే పార్టీల లోపలే ఎక్కువగా కన్పిస్తోంది.
ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం చేపట్టిన వడ్డీ లేని రు ణాల పథకంలో పట్టణ మ హిళా సంఘాల సభ్యులకు రుణాలు, ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియ త్వరగా పూర్తిచేయాలని ఉపముఖ్య మంత్రి, ఆర్థిక, ప్రణాళిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు.
రాష్ట్ర అభివృదిఽ్ధ,ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయ, సంక్షేమ పథకాల అమలుకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతి, ఎక్సైజ్ శాఖ మంత్రి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల కోసం చకచకా అడుగులు వేస్తోంది. ఓటరు తుది జాబితా జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో ప్రక్రియ పూర్తి చేసిన విషయం తెలిసిందే. తాజాగా జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్నగర్ మున్సిపాలిటీలో రిజర్వేషన్ల జాబితాను అధికారులు విడుదల చేశారు.
సంక్రాంతి వేడుకలను జిల్లావ్యాప్తంగా ప్రజలు వైభ వంగా నిర్వహించారు. అద్యంతం అబంరాన్నంటే లా సాగిన వేడుకల్లో ప్రజలు పెద్దఎత్తున పాల్పంచు కున్నారు.
ప్రజలు దంత ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్బాబు సూచించారు.
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు ఎస్పీ నితికా పంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లాపై సీఎం రేవంత్రెడ్డి వరాల జల్లు కురిపించారు. రూ.386 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు, సదర్మట్ బ్యారేజ్ను జాతికి అంకితం చేశారు. జిల్లాకు ప్రత్యేక యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. కేసీఆర్ హయాంలోని పెండింగ్ ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందని సీఎం స్పష్టం చేశారు.
మున్సిపల్ ఎన్నికలకు అడుగులు వేగంగా పడుతున్నాయి. ఎన్నికల్లో భాగంగా అంశాలవారీగా పనులు పూర్తి చేస్తుండగా, ఇప్పటికే వార్డుల పునర్విభజన ముసాయిదా జాబితా విడుదల చేసి, అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది జాబితాను సైతం ప్రజల ముందు ఉంచారు.