Home » YSRCP
వైసీపీ ప్రభుత్వం దేవాలయాలను ధ్వంసం చేసి, భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు ఆక్షేపించారు. వంశపారంపర్య ధర్మకర్తగా తాను రామతీర్థం వెళ్తే తీవ్ర అవమానానికి గురిచేశారని అశోక్ గజపతిరాజు ఆవేదన వ్యక్తం చేశారు.
పరిశ్రమలను అడ్డుకోవడానికి వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ ఫైర్ అయ్యారు. వైసీపీ నేతలు పోగు చేసుకున్న ల్యాండ్ పోతుందనే భయం వారికి ఉందని విమర్శించారు. ఇన్ఫోసిస్కి జగన్ హయాంలో ఎక్కడైనా ల్యాండ్ ఇచ్చారా.. ఏపీకి వచ్చిన కంపెనీలకి సౌకర్యాలు కల్పించారా అని ఎంపీ శ్రీ భరత్ ప్రశ్నల వర్షం కురిపించారు.
ఈ ఘటనతో తీవ్ర భయాందోళనకు గురైన యజమాని శేఖర్ పోలీసులను ఆశ్రయించారు. సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో నాగార్జున యాదవ్పై ఫిర్యాదు చేశారు.
దేవాలయాల ఆస్తుల పరిరక్షణ కోసం స్పెషల్ చీఫ్ సెక్రటరీ, డీజీపీలతో కూటమి ప్రభుత్వం కమిటీ వేసిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఆలయాల్లో నాయీబ్రాహ్మణులకి ట్రస్టు బోర్డు మెంబర్లుగా అవకాశం కల్పించామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గుర్తుచేశారు.
సోషల్ మీడియా ద్వారా కులాల మధ్య చిచ్చుకు వైసీపీ యత్నిస్తోందని తెలుగుదేశం ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్ విమర్శించారు. కులాల మధ్య చిచ్చు, కుట్రలతో రాజకీయాలు చేద్దామనుకుంటున్న వైసీపీపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రవిచంద్ర యాదవ్ సూచించారు.
హంద్రీ-నీవా పథకం ద్వారా కేవీ పల్లె మండలం అడవిపల్లె వద్ద రిజర్వాయర్ నిర్మించి కరువు పీడిత ప్రాంతమైన ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సాగు, తాగునీరు అందించాలని 2006లో అప్పటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం..
ప్రతిపక్షహోదా ఇవ్వకుంటే శాసనసభకు రానని భీష్మించుకుని కూర్చొన్న పులివెందుల ఎమ్మెల్యే, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యేల భవితవ్యం మీద టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు క్లారిటీ..
తెలుగుదేశం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గ్రామస్థాయి కార్యకర్తలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలకు పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సినిమా టికెట్ ధరలు పెంచడం వల్ల సగటు చిన్న నిర్మాతలు నష్టపోతున్నారని తెలుగు సినిమా నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యుడికి కూడా వినోదాన్ని పంచేది కేవలం సినిమా మాత్రమేనని తెలిపారు. అలాంటి సినిమా టికెట్ ధరలు పెంచితే సామాన్యుడు ఇబ్బంది పడతారని నారాయణ మూర్తి పేర్కొన్నారు.
శాసన మండలికి వచ్చిన వారు కాఫీ, టీల కోసం దెబ్బలాడటం సిగ్గుచేటంటూ మంత్రి సంధ్యారాణి వ్యాఖ్యలు చేశారు. ఇవాళ వైసీపీ కాఫీ, టీ కోసం చేసిన గొడవ వల్ల మండలిలో ప్రశ్నలే రాకుండా పోయాయని మంత్రి మండిపడ్డారు.