Home » YSRCP
తనపై అనర్హత వేటు కక్షపూరిత చర్య అని ఎమ్మెల్సీ జంగా కృష్ణ మూర్తి తెలిపారు. మౌఖికంగా తన వివరణ తీసుకోకుండానే వేటు వేశారన్నారు. ఈ వేటును బీసీలపై తీసుకున్న చర్యగా భావిస్తున్నానన్నారు. ఎమ్మెల్సీ పదవి తనకు వ్యక్తిగతంగా ఇచ్చిన పదవి కాదన్నారు. తన బీసీ వర్గాలకు ఇచ్చిన పదవి అని పేర్కొన్నారు. చైర్మన్పై ఒత్తిడి తీసుకొచ్చి తనపై వేటు వేయించారన్నారు.
Andhrapradesh: ‘‘వన్ సైడ్ విక్టరీ మాది...మళ్ళీ జగనే సీఎం’’ అని మంత్రి గుడివాడ అమర్నాథ్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. గతంలో కంటే 1 సీటు అయినా వైసీపీ గెలుచుకుంటుందని.. 23 ఎంపీ స్థానాలు గెలుచుకుంటామని స్పష్టం చేశారు. వైసీపీ ఎంపీల అవసరం ఉండే ప్రభుత్వం కేంద్రంలో రావాలని కోరుకుంటున్నామని తెలిపారు.
Andhrapradesh: చంద్రగిరి ఎన్నికల అధికారి నిషాంత్ రెడ్డిని మార్చకపోతే కౌంటింగ్లో అక్రమాలు జరుగుతాయని టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి స్ట్రాంగ్ రూమ్ వద్ద సీఆర్పీఎఫ్ బలగాలను తొలగించారన్నారు. స్ట్రాంగ్ రూమ్ వెనుక దారి చెవిరెడ్డి సొంత ఊరు తుమ్మలగుంటకు వెళుతుందన్నారు. అలా వెనుక ఒక గేట్ ఉందని.. దాని ద్వారా అక్రమంగా లోపలికి చొరబడవచ్చన్నారు.
పోలింగ్ రోజు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో జరిగిన వైసీపీ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం కళ్లకుంట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి
ఈసారి ఏపీ ఎన్నికల్లో పోలింగ్ పెద్ద ఎత్తున జరిగింది. ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. ఇది ఎవరికి ప్లస్ అవుతుందో.. మైనస్ అవుతుందో పక్కనబెడితే పోలింగ్లో కొన్ని ఆసక్తికర విషయాలు కూడా చోటు చేసుకున్నాయి. వాటిలో ఒకటేంటంటే.. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి టీడీపీకి ఓటేశారని తెలుస్తోంది. అయితే ఇది కావాలని చేయలేదట.. పోలింగ్ సిబ్బందితో మాట్లాడుతూ హడావిడిగా సైకిల్కి ఓటేశారట.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ జరిగిన తర్వాత.. రాష్ట్రంలో పలు అల్లర్లు జరుగుతుండటంపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్కు తెలుగుదేశం పార్టీ, బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఏపీలో శాంతి భద్రతలు, నిధుల వ్యయంపై ఫిర్యాదు చేశారు.
ఏపీలో ఎన్నికలు(ap elections 2024) పూర్తై రెండు రోజులైనా కూడా వైసీపీ(YSRCP) కార్యకర్తల కవ్వింపు చర్యలు మాత్రం తగ్గడం లేదు. టీడీపీ(TDP) కార్యకర్తలు కనిపిస్తే చాలు వైసీపీ శ్రేణులు తట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే కృష్ణాజిల్లా(Krishna District) మచిలీపట్నం బలరాంపేటలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడులు చేసేందుకు ప్రయత్నించారు.
ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని.. ఎన్డీఏ కూటమి గెలుస్తుందని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి (Kishan Reddy) ధీమా వ్యక్తం చేశారు.ఏపీలో అల్లర్లపై కేంద్ర ఎన్నికల కమిషన్, ఏపీ పోలీసులు కఠినంగా వ్యవహరించాలని హెచ్చరించారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో (AP Elections 2024) అధికార వైసీపీ (YSRCP) మంత్రులు, క్యాబినేట్ అంతా ఓటమి చవి చూడనుందని ప్రముఖ సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టికుమార్ (Nattikumar) అన్నారు. అందుకే ఓటమి భయంతో దాడులు చేస్తున్నారని చెప్పారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ (YSRCP)కి ఓటమి తప్పదని.. అసహనంతోనే హింసకు పాల్పడుతున్నారని జనసేన నేత నాగబాబు (Naga Babu) అన్నారు. ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర భద్రత పెంచాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. హింసకు పాల్పడ్డ వైసీపీ నేతలే ఎన్నికల సంఘాన్ని, పోలీసులను నిందించడం విడ్డూరంగా ఉందని అన్నారు.