Home » YSRCP
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కంచుకోటకు బీటలు వారాయి. పులివెందుల బైపోల్ జగన్ నాయకత్వానికి గొడ్డలిపెట్టు అయింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ విజయ బావుటా ఎగురవేసింది. టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఘన విజయం సాధించారు.
రామచంద్రపురం జెడ్పీటీసీ మేర్నీడి వెంకటేశ్వరరావు ఆకస్మికంగా మృతిచెందారు. ఆయన స్వగ్రామం రామచంద్రపురం మండలం తోటపేట గ్రామం. 2021లో జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ తరుపున మేర్నీడి వెంకటేశ్వరరావు విజయం సాధించారు.
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ ఆదేశించారు. మంగళవారం రిమ్స్ సమీపంలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీ పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. జడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్ గురువారం ఉదయం 8గంటలకు ప్రారంభం అవుతుందని చెప్పుకొచ్చారు.
ఈ దొంగఓట్ల విషయంలో వైసీపీ వారే.. హాట్ లైన్ ద్వారా రాహుల్ గాంధీకి చెప్పి నేర్పించినట్టు ఉందని పయ్యావుల కేశవ్ ఆరోపించారు. కేంద్రంలోని ఎన్డీఏలో బలమైన, నమ్మకమైన భాగస్వామ్యంతో ఉన్నామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఒకప్పుడు తమ పార్టీ మెంబరే అని తెలిపారు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు బుధవారం రిమాండ్ ముగిసింది. రిమాండ్ ముగియడంతో వైసీపీ రాజంపేట ఎంపీ మిథున్రెడ్డిని విజయవాడ ఏసీబీ కోర్టుకు రాజమండ్రి పోలీసులు తరలించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో మిథున్రెడ్డి ఉన్న విషయం తెలిసిందే.
ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో విచారణకు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ హాజరయ్యారు. మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ నోటీసులు జారీ చేశారు.
154 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిన వైసీపీ నేతలకు బుద్ధి రావడం లేదని మంత్రి డోల వీరాంజనేయ స్వామి విమర్శించారు. ఈరోజు పులివెందులలో కూడా వైసీపీ ఓటమి ఖాయమని.. వారు జీర్ణించుకోలేకపోతున్నారని ఆక్షేపించారు. ఓటమిని జీర్ణించుకోలేక రెక్కింగ్ చేస్తున్నారని, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి డోల వీరాంజనేయ స్వామి ధ్వజమెత్తారు.
టీడీపీకి అనుకూలంగా ఓటు వేయెుద్దంటూ కేకలు పెడుతూ కారు ధ్వంసం చేశారు వైసీపీ గూండాలు. దీంతో ఓటర్లు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మరోవైపు ఒంటిమిట్టలోని చింతరాజుపల్లె, రాచపల్లిలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.
మ్మడి కడప జిల్లాలోని రెండుచోట్ల జరిగే జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం నువ్వా నేనా అన్నట్లు సాగింది. ఆదివారం సాయంత్రానికి ప్రచార సమయం ముగియడంతో అంతా గప్చుప్గా మారింది. పులివెందుల నుంచి టీడీపీ జడ్పీటీసీ సభ్యురాలిగా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి పోటీ చేస్తుండగా, వైసీపీ నుంచి హేమంత్రెడ్డి బరిలో ఉన్నారు.
అధికారంలో ఉన్న టీడీపీ, ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో పులివెందుల జడ్పీటీసీ ఎన్నికపై రాష్ట్రమంతా ఆసక్తి నెలకొంది. ఆగస్టు 12న పోలింగ్ జరగనుండగా.. ఇవాళ్టితో(ఆదివారం) ప్రచారానికి తెరపడింది. దీంతో తెరవెనుక రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి.