Home » YSRCP Cadre
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ కలలో కూడా ఊహించని రీతిలో ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఆఖరికి ప్రతిపక్ష హోదాను సైతం కోల్పోయి క్రికెట్ టీమ్లాగా 11 కే పరిమితం అయిన పరిస్థితి. దీంతో ఫలితాల మరుసటి రోజే రాజీనామాలు మొదలై.. నేటికి కొనసాగుతూనే ఉన్నాయి...
ఎవరు ఏమనుకుంటే మాకేంటి..? మా పనులు సక్రమంగా సాగాలి..! పైసలు జేబులోకి రావాలి..! మా అవినీతి, అక్రమాలకు కొమ్ముకాస్తే టీడీపీలోకి వచ్చేందుకు మేము సిద్ధం అంటూ..
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పూర్తై.. ఫలితాలు వచ్చాయి. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడింది. ఈ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఐదేళ్ళ వైసీపీ పాలన చూసిన ప్రజలు 2024 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి అధికారం కట్టబెట్టారు.
మాజీ ముఖ్యమంత్రిగా, పులివెందుల ఎమ్మెల్యే హోదాలో తొలిసారి సొంత గడ్డకు వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి (YS Jagan Mohan Reddy) సొంత పార్టీ శ్రేణుల నుంచి అడగడుగునా షాక్లు ఎదురవుతున్నాయి..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అడుగడుగునా ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. అసలు ప్రతిపక్ష హోదా దక్కకపోవడం.. ఆపై విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తే అంతంత మాత్రమే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు రావడం..
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్కు(YS Jagan) గట్టి షాక్ ఇచ్చారు సొంత పార్టీ నేతలు. ఇప్పటికే పార్టీ ఓటమితో తీవ్ర నైరాశ్యంలో ఉన్న ఆయనకు సొంత పార్టీ నేతల నుంచి ఊహించని తిరస్కరణ ఎదురైంది. సొంత జిల్లాల్లోనే ఆయన చేదు అనుభవం ఎదుర్కొన్నారు. శనివారం కడపకు(Kadapa) వెళ్లిన జగన్కు..
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ (YSRCP) ఘోర పరాజయం పాలైన తర్వాత ఒక్కసారిగా రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 11 సీట్లకు పరిమితం కావడం.. ఇక 25 ఎంపీ స్థానాల్లో కేవలం 04 స్థానాల్లోనే గెలవడంతో పార్టీకి గడ్డు పరిస్థితులు వచ్చినట్లయ్యింది...
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపాలైన వైసీపీ(YSRCP) ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు, ముఖ్య నేతలతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) భేటీ అయ్యారు. 2029లో మళ్లీ వైసీపీనే వస్తుందంటూ వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు జగన్. 2029 వచ్చే నాటికి చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తారని అన్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) బలగమెంత..? మాజీ సీఎంతో ఎంత మంది ఉన్నారు..? ఎన్నికల ముందు.. ఫలితాల తర్వాత వైసీపీ పరిస్థితి ఎలా ఉంది..? ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు..? వైసీపీ (YSR Congress) మళ్లీ పుంజుకునేది ఎప్పుడు..? అసలు అది అయ్యే పనేనా..? ఇలా ఒకటా రెండా వందల సంఖ్యలో ప్రశ్నలు వస్తున్నాయి..
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అలా కూటమి గెలిచిందో లేదో ఆ మరుక్షణమే సీన్ మొత్తం మారిపోయింది. అప్పటి వరకూ వైసీపీలో ఓ వెలుగు వెలిగి కనీసం ప్రతిపక్ష హోదా లేకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న పరిస్థితి.