Home » YS Jagan Mohan Reddy
వైసీపీ మాజీ మంత్రులు తనపై పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. కొందరూ వ్యవస్థలో లొసుగులను ఉపయోగించి పనిచేస్తున్నారని ఫైర్ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు రాష్ట్ర ప్రజలను ఉత్సుకతకు గురిచేస్తున్నాయి. తాజాగా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినోత్సవం వేళ తెలుగుదేశం పార్టీలో పలువురు చేరారు. ఈ సంఘటన వైసీపీకి భారీ షాక్ అని చెప్పొచ్చు.
వైసీపీలో మరోసారి కుమ్ములాటలు బయటపడ్డాయి. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 53వ పుట్టిన రోజు వేడుకలను వైసీపీ నేతలు నిర్వహించుకుంటున్నారు. ఈ క్రమంలో పలు నియోజకవర్గాల్లో జరిగిన బర్త్డే వేడుకలు చర్చనీయాంశంగా మారాయి.
వైఎస్ జగన్ బర్త్డే కటౌట్లో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ఫొటోలు ఉండటంతో సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో కీలక మార్పులు జరగడంతో విచారణ మరింత ఆలస్యమయ్యే పరిస్థితి ఏర్పడింది.
మాజీ సీఎం జగన్పై దేవినేని ఉమా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పులివెందుల మెడికల్ కాలేజీకి రూ.481 కోట్లు ఖర్చు చేసిన జగన్.. పాడేరు, పార్వతిపురం కాలేజీలకు ఎందుకు ఖర్చు చేయలేదని ప్రశ్నించారు.
ఐటీ పెట్టుబడులు, యువత ఉద్యోగాలపై జగన్ అండ్ కో కుట్ర చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. యువత భవిష్యత్పై ద్వేషంతోనే జగన్ ఈ పని చేస్తున్నారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బంధువు అర్జున్ రెడ్డి ఈరోజు (శుక్రవారం) గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్కు విచారణ నిమిత్తం హాజరయ్యారు.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, వారి కుటుంబ సభ్యుల చిత్రాలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కేసులో మాజీ సీఎం జగన్ బంధువు అర్జున్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో అర్జున్ రెడ్డి ఈరోజు విచారణకు హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ను గురువారం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలవనున్నారు. గవర్నర్తో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయి.