Share News

Gudivada PS: గుడివాడ పీఎస్‌కు జగన్ బంధువు

ABN , Publish Date - Dec 19 , 2025 | 12:10 PM

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, వారి కుటుంబ సభ్యుల చిత్రాలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కేసులో మాజీ సీఎం జగన్ బంధువు అర్జున్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో అర్జున్ రెడ్డి ఈరోజు విచారణకు హాజరయ్యారు.

Gudivada PS: గుడివాడ పీఎస్‌కు జగన్ బంధువు
Gudivada PS

కృష్ణా జిల్లా, డిసెంబర్ 19: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Former CM YS Jagan Mohan Reddy) బంధువు అర్జున్ రెడ్డి ఈరోజు (శుక్రవారం) గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు విచారణ నిమిత్తం హాజరయ్యారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, వారి కుటుంబ సభ్యుల చిత్రాలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి, సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నారంటూ గత ఏడాది అర్జున్ రెడ్డిపై గుడివాడలో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఆ కేసులో సోమవారం రాత్రి పోలీసుల నుంచి అర్జున్ రెడ్డి నోటీసులు అందుకున్నారు. విచారణ నిమిత్తం నేడు గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు అర్జున్ రెడ్డి హాజరయ్యారు.


అప్పట్లో అరెస్ట్ చేసేందుకు గుడివాడ పోలీసులు యత్నించగా అర్జున్ విదేశాలకు పరారైన విషయం తెలిసిందే. తరువాత పోలీసులు లుక్ అవుట్ సర్క్యూలర్ జారీ చేశారు. ఈనెల ఎనిమిదో తేదీ రాత్రి విదేశాల నుండి తిరిగి రావడంతో అర్జున్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్‌పోర్టుఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఏప పోలీసు బృందాలు.. అతడిని అదుుపులోకి తీసుకుని సీఆర్పీసీ సెక్షన్ 41 ఏ కింద నోటీసులు అందజేశారు. ఉమ్మడి కడప, అనేక జిల్లాల్లో అర్జున్ రెడ్డిపై కేసులు నమోదు అయ్యాయి. జగన్ కు బాబాయి వరస అయ్యే వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడే ఈ అర్జున్ రెడ్డి.


ఇవి కూడా చదవండి...

వీరితో పోటీ కన్నా.. ఎన్నికల్లో పోటీ తేలిక

శ్రీశైలంలో రీల్స్‌పై యువతి క్షమాపణలు

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 19 , 2025 | 12:41 PM