Home » Gudivada
కృష్ణా జిల్లాలోని గుడివాడ యూనియన్ బ్యాంకులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బైపాస్ రోడ్డులోని బ్యాంక్ కార్యాలయం నుంచి ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కొడాలి నాని అనుచరుడు నకిలీ పోలీసు అవతారం ఎత్తి బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో కొడాలి నాని అనుచరుడిపై పోలీసులకి ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగి ఆటకట్టించారు.
గత వైసీపీ ప్రభుత్వంలో గుడివాడ ఏరియా ప్రభుత్వాస్పత్రిపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా కరోనా సమయంలో దాతలు ఇచ్చిన వస్తువులు, దుప్పట్లు, మాస్కులు శానిటైజర్లు, ఆక్సిజన్ పరికరాలు, నగదుతో కొనుగోలు చేసిన బెడ్లు తదితరాల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
గుడివాడ వివాదంపై మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత పేర్ని నాని ఫోన్ సంభాషణ లీక్ అయింది. కూటమి నేత, వైసీపీ నేత మధ్య జరిగిన వాగ్వాదానికి కులం రంగు పులిమి వివాదం చేయాలని పేర్ని నాని ప్రయత్నం చేస్తున్నట్లు ఆ సంభాషణలో ఉంది.
Gudivada Flexi War: టీడీపీ, వైసీపీ పోటాపోటీ ఫ్లెక్సీలతో గుడివాడలో రాజకీయం హీటెక్కింది. వరుసగా రెండు రోజుల నుంచి పేర్నినాని చేస్తున్న వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ ఫ్లెక్సీని టీడీపీ శ్రేణులు చించివేశారు.
Kodali Nani Court Violation: కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా మాజీ మంత్రి కొడాలి నాని.. పెద్ద సంఖ్యలో తన అనుచరులతో కలిసి ఇంటి వద్ద నుంచి స్టేషన్కు వచ్చి మరీ సంతకాలు చేశారు.
గుడివాడలో మాజీమంత్రి కొడాలి నాని సుదీర్ఘ విరామం తర్వాత కనిపించారు. ఓ కేసులో ముందస్తు బెయిల్ కోసం గుడివాడ కోర్టుకు కొడాలి నాని హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం కొడాలి నాని వచ్చారు.
YSRCP VS TDP: గుడివాడలో మరోసారి వైసీపీ మూకలు అలజడులు సృష్టించారు. టీడీపీ నేతకు చెందిన ఓ కార్యాలయంపై దాడి చేశారు. అడ్డు వచ్చిన వారిని బెదిరించారు. ఈ విషయంపై టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సీఎం చంద్రబాబు పుట్టినరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతో ప్రాముఖ్యమైన రోజని, గత ఏడాది పర్యటనలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన చోటే చంద్రబాబు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే రాము అన్నారు. ఆంధ్రప్రదేశ్ అవసరాలను తీర్చడానికి ఎలాంటి పరిస్థితుల్లోనైనా ముందు నిలబడుతూ... రాష్ట్ర తలరాతను మార్చేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న మహోన్నత వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు.
‘‘మీకు తెలుసా!? ఈ సమయంలో దావోస్లో మైనస్ 5, మైనస్ 10 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. మూడువేలమంది దాకా ప్రతినిధులు ఉంటారు. అంత చలి ఉంటే స్నానం చేస్తామా?’’...