Home » Gudivada
కృష్ణాజిల్లా గుడివాడలో బైండోవర్ ఉల్లంఘించిన గొల్లపల్లి పోతురాజును అరెస్ట్ చేసి జైలుకు తరలించామని డీఎస్పీ పి. శ్రీనివాస్ వెల్లడించారు. సెక్షన్ 129(ఇ) బీఎన్ఎస్ఎస్ ప్రకారం ఏడాది పాటు బైండోవర్లో అతడు ఉన్నారన్నారు.
గుడివాడలోని ప్రసిద్ధ శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో కోటి రూపాయల విలువైన బంగారు కిరీటం మాయంపై దేవాదాయ శాఖ విచారణ చేపట్టింది. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ లలిత హుటాహుటిన ఆలయానికి చేరుకుని అర్చకుల నుంచి వివరాలు సేకరించారు.
రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఉమ్మడి కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత వల్లభనేని బాబురావు తుదిశ్వాస విడిచారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని తన స్వగృహంలో కన్నుమూశారు.
కృష్ణా జిల్లా గుడివాడలో తీవ్ర విషాదం నెలకొంది. సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ఉద్యోగంలో చేరి జీవితంలో స్థిరపడతాడనుకున్న యువకుడు ఉద్యోగంలో చేరిన పది రోజులకే హరియాణలో విగతజీవిగా పడి ఉండటం స్థానికులను కలచివేస్తోంది.
గుడివాడలో బెట్టింగ్లకు పాల్పడుతున్న కొడాలి నాని అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్లైన్ బెట్టింగ్ ముఠా శిబిరాలపై మచిలీపట్నం క్రైమ్ బ్రాంచ్, గుడివాడ రూరల్ పోలీసులు ఆకస్మికంగా దాడులు చేశారు.
జిల్లాలోని గుడివాడలో టీడీపీ సానుభూతిపరుడు దుగ్గిరాల ప్రభాకర్ కిడ్నాప్ అంశం తీవ్ర కలకలం రేపింది. గత ప్రభుత్వ పెద్దల అవినీతిపై ఫిర్యాదులు చేశారనే కారణంతో అతన్ని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. ఈ అంశంలోనే అతన్ని బెదిరించి..
విద్యార్థులు ఆంగ్లంలో ప్రతిభ కనబర్చేలా అధ్యాపకులు చూడాలని సీఎం చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి సూచించారు. తానూ నిమ్మకూరు రావడం స్వీట్ మెమరీ అని.. ఇది మా తాత లక్ష్మయ్య ఊరని చెప్పుకొచ్చారు. చిన్నప్పుడు సెలవులు వస్తే అమ్మ, తమను నిమ్మకూరు పంపించేదని అన్నారు.
మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కొడాలి నానికి ఊహించని షాక్ తగిలింది. ప్రధాన అనుచరుడు, రాజకీయ సలహాదారుడు కూనసాని వినోద్ను గుడివాడ వన్ టౌన్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, వారి కుటుంబ సభ్యుల చిత్రాలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కేసులో మాజీ సీఎం జగన్ బంధువు అర్జున్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో అర్జున్ రెడ్డి ఈరోజు విచారణకు హాజరయ్యారు.
ఏ వ్యక్తి తన మూలాలను మర్చిపోకూడదని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సూచించారు. విదేశాలకు వెళ్లి సంపాదించుకోవడం కంటే మాతృమూర్తి, మాతృదేశానికి సేవ చేయడంలో వచ్చే ఆనందం వేరని పేర్కొన్నారు.