Home » YS Jagan Mohan Reddy
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏఐబీఎస్పీ జాతీయ సమన్వయకర్త, మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు షాకింగ్ కామెంట్స్ చేశారు. నెల్లూరు జిల్లా కరేడు ప్రాంతంలో బడుగు, బలహీన వర్గాలకు చెందిన భూములపై వైసీపీ పెద్దలు కన్నువేశారని పూర్ణచంద్రరావు ఆరోపించారు.
ఏపీలో అనేక ప్రాంతాల్లో డెన్లు ఏర్పాటుచేసి జగన్ అండ్ కో వేలకోట్లు దాచుకున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ రూ.200 కోట్లు అయితే ఆంధ్రప్రదేశ్లో జగన్ అండ్ కో చేసిన లిక్కర్ స్కాం రూ. 3500 కోట్లు అని షాకింగ్ కామెంట్స్ చేశారు. జగన్ అక్రమాలు బయటకు వస్తాయనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మంత్రి పయ్యావుల ధ్వజమెత్తారు.
కడప జిల్లాలో బద్వేల్ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తెలిపారు. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే బీజేపీని గెలిపించుకునేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఏ ఉపఎన్నిక వచ్చినా కూటమి తరపున పోటీ చేసే అభ్యర్థి గెలిచేలా ఉండాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ బలపడాలని, బీజేపీ వాటా బీజేపీకి ఇవ్వాలని కోరారు.
రాబోయే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కలసి పోటీ చేస్తాయనే భయాందోళనలతో మాజీ మంత్రి కేటీఆర్ ఉన్నారని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ విమర్శించారు. తెలంగాణలో బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేస్తే కేటీఆర్కి ఏంటి బాధ అని ప్రశ్నించారు. తెలంగాణలో సీఎం రేవంత్రెడ్డికి మద్దతుగా ఉన్నారని రెడ్లను, ఏపీలో చంద్రబాబుకు మద్దతుగా ఉన్నారని కమ్మ కులస్తులను కేటీఆర్ విమర్శించిన మాట నిజం కాదా అని ఎంపీ రమేష్ ప్రశ్నించారు.
తమ ప్రభుత్వానికి ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి అధికారంలోకి వచ్చామని గుర్తుచేశారు. రాజధాని భూ సమీకరణపై తన నిర్ణయాన్నిఇప్పటికే సీఎం చంద్రబాబుకి చెప్పానని తెలిపారు.
తెలుగుదేశం అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం ప్రజల పక్షాన పనిచేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు ఉద్ఘాటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం ‘సుపరిపాలనలో ముందడుగు’ అని తెలిపారు.
ప్రజలను మోసం చేసి మద్యం కుంభకోణంలో జగన్ దోచుకున్న రూ.3500 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేయాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కూటమి ప్రభుత్వానికి సూచించారు. రెవెన్యూ రికవరీ చట్టం లేదా కొత్త చట్టం తీసుకొచ్చి జగన్ కాజేసిన సొమ్మును ప్రభుత్వం వసూలు చేయాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎక్సైజ్ మంత్రి కె. నారాయణ స్వామికి జులై 21న విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసులు జారీ చేసింది. కానీ, సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు..
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చేతిలో రీజన్స్ ఫర్ అరెస్టు నివేదిక ఉంది. కోర్టులో 10 పేజీల రీజన్స్ ఫర్ అరెస్టు రిపోర్టు దాఖలు చేశారు సిట్ అధికారులు. లిక్కర్ స్కాం కేసులో మిథున్రెడ్డి పాత్ర స్పష్టంగా ఉందని అధికారులు తెలిపారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లు జగన్, వైసీపీ నేతలు ప్రజల గురించి ఎందుకు ఆలోచించలేదని ప్రశ్నించారు. గత జగన్ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.