Home » YCP
అంగన్వాడీల విషయంలో వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలోనే అంగన్వాడీలకు అమ్మఒడి పథకం అందలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లికి వందనం అమలు చేసిందని తెలిపారు.
వైసీపీ నేతలకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సవాల్ విసిరారు. డీఎస్సీపై మంత్రి నారా లోకేశ్ విసిరిన సవాల్ను వైసీపీ నేతలకు దమ్ము, ధైర్యం ఉంటే స్వీకరించాలన్నారు. డీఎస్సీపై బహిరంగ చర్చకు రావాలని జగన్, వైసీపీకి ఛాలెంజ్ చేశారు.
ఒకాయన టీడీపీ నేత, టీటీడీ బోర్డు సభ్యుడు. మరొకాయన వైసీపీ నేత. టీటీడీ బోర్డు సభ్యుడి కుమారుడితోనూ, ఆయన పీఏతోనూ వైసీపీ నేత కుమారుడు సన్నిహితంగా ఉంటారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో నేటి నుంచి ఇంటింటి ప్రచారం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు ప్రారంభించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు.
కృష్ణా జిల్లా వైసీపీ యూత్ అధ్యక్షుడు మెరుగుమాల ఖాళీ పుట్టినరోజు పార్టీలో రచ్చ చోటు చేసుకుంది. గుడివాడ టీచర్స్ కాలనీలోనీ ఓ భవనం పైఅంతస్తులో 100 మందితో అర్ధరాత్రి మద్యం పార్టీ నిర్వహించారు.
వైసీపీ నేతలపై టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో ఆ పార్టీ అధ్యక్షుడి నుంచి దిగువస్థాయి నాయకుడి వరకూ అక్రమాలు, అరాచకాలు చేశారని ఆరోపించారు.
అభివృద్ధి అంటే వైసీపీ నేతలకు కడుపు మంట.. విధ్వంసమంటే వినోదం.
రాష్ట్రంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని రిజిస్ట్రేషన్ సేవలు ప్రైవేటీకరణ అంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలు అసత్యమని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ దుష్ప్రచారాన్ని ప్రభుత్వం ఖండించింది.
నెల్లూరు జిల్లా కావలి మండలం తాగేటివారిపాలెంలో టీడీపీ కార్యకర్త చాట్ల వాసు హత్య రాజకీయంగా కలకలం రేపింది. ఇటీవల జరిగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఏపీ లిక్కర్ రవాణా కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ కేసులో పలు కీలక విషయాలను ఈడీ అధికారులు గుర్తించారు.